SpiceJet Flight: ఢిల్లీలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన స్పైస్జెట్ విమానం, వెంటనే ప్రయాణికులను దింపేసిన సిబ్బంది, ప్రత్యామ్నాయ విమానంలో జమ్మూకు తరలించిన అధికారులు
ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ప్రయాణికులతో వెళ్తున్న స్పైస్జెట్ విమానం ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే, ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులను విమానం దింపి, మరో విమానంలో తరలించినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ప్రయాణికులతో వెళ్తున్న స్పైస్జెట్ విమానం ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే, ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులను విమానం దింపి, మరో విమానంలో తరలించినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు. ఎస్జీ160 విమానం ఢిల్లీ నుంచి జమ్మూకు వెళ్లాల్సి ఉన్నది. ప్రయాణికుల విమానం ఎక్కిన తర్వాత.. పుష్ బ్యాక్ చేస్తున్న సమయంలో విమానం కుడి వైపు రెక్క విద్యుత్ స్తంభాన్ని తాకడంతో దెబ్బతిన్నది. దీంతో వెంటనే ప్రయాణికులను అందులో నుంచి దింపి.. మరో ప్రత్యామ్నాయ విమానంలో జమ్మూకు తరలించినట్లు స్పైస్సెట్ ప్రతినిధి వివరించారు.
Today, SpiceJet flight SG 160 was scheduled to operate between Delhi & Jammu. During push back, the right-wing trailing edge came in close contact with a pole, causing damage to aileron. A replacement aircraft has been arranged to operate the flight: SpiceJet Spokesperson. pic.twitter.com/oZ7rPQYhoB
— ANI (@ANI) March 28, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 28, 2022 04:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

