Encounter in JK: జమ్మూకశ్మీర్‌ లో ఎన్‌ కౌంటర్.. ముగ్గురు ఆర్మీ జవాన్ల వీరమరణం.. ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న గాలింపు

జమ్మూకశ్మీర్‌ లోని కుల్గాం జిల్లాలో దారుణం జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి.

Encounter in JK: జమ్మూకశ్మీర్‌ లో ఎన్‌ కౌంటర్.. ముగ్గురు ఆర్మీ జవాన్ల వీరమరణం.. ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న గాలింపు
Credits: Twitter

Newdelhi, Aug 5: జమ్మూకశ్మీర్‌ (Jammukashmir) లోని కుల్గాం జిల్లాలో (Kulgam District) దారుణం జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌ కౌంటర్‌ (Encounter) లో ముగ్గురు ఆర్మీ జవాన్లు (Jawans) అమరులయ్యారు. హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపగా భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు కాగా, ఆ తర్వాత వారు మరణించినట్టు ఆర్మీ తెలిపింది. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.

TSRTC Strike: ముగిసిన ఆర్టీసీ కార్మికుల నిరసన.. రెండు గంటల విరామం అనంతరం మళ్లీ ప్రారంభమైన బస్సు సర్వీసులు.. ఉదయం 11.00 గంటలకు రాజ్‌భవన్ ఎదుట మరోమారు నిరసన కార్యక్రమం

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 05, 2023 10:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).