Indian Army Using AI: సరిహద్దుల్లో ఏఐతో నిఘా.. భారత ఆర్మీ కీలక నిర్ణయం?!
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ భారత ఆర్మీ కీలక నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది. శత్రువుల సైనిక మోహరింపుపై నిఘా పెట్టేందుకు కృత్రిమ మేధ (ఏఐ) సాయం తీసుకొనే యోచనలో ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Newdelhi, Dec 10: సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ భారత ఆర్మీ (Indian Army) కీలక నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది. శత్రువుల (Enemy) సైనిక మోహరింపుపై నిఘా పెట్టేందుకు కృత్రిమ మేధ (ఏఐ-AI) సాయం తీసుకొనే యోచనలో ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా ఆర్మీ ఏఐ ఆధారిత దేశీయంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్ వేర్ ను వినియోగించనున్నదని తెలిపాయి. ఈ కొత్త సాంకేతికత సరిహద్దుల వెంబడి శత్రు దేశాల సైన్యం మోహరించిన ఆయుధాలు, యుద్ధ వాహనాలు, ఇతర యుద్ధ పరికరాల ఎలక్ట్రానిక్ పరమైన వివరాలను సేకరిస్తుందని, తద్వారా భవిష్యత్తులో మనం చేపట్టాల్సిన చర్యలను నిర్దేశించుకోవడంలో సహకరిస్తుందని వివరించాయి. శాటిలైట్లు, రాడార్లు ఆధారంగా ఏఐ సాఫ్ట్వేర్ డాటా సేకరిస్తుందని పేర్కొన్నాయి.
Aadhaar Iris Scan: ఫింగర్ ప్రింట్స్ లేకున్నా ఐరిస్ తో ఆధార్ జారీ.. కేంద్రం శుభవార్త
Army to use AI to track enemy deployment https://t.co/B490Rfg8Dm
— xxy (@xxy07255392) December 9, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 10, 2023 09:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

