Andhra Pradesh Shocker: కడపలో దారుణం, భార్యతో సహా ఇద్దరు పిల్లలను తుఫాకీతో కాల్చి ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, వ్యక్తిగత కారణాలే కారణమని తెలిపిన కడప డీఎస్పీ షరీఫ్‌

కడపలో కో-ఆపరేటివ్‌ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు (50) అనే హెడ్‌ కానిస్టేబుల్‌ తన భార్య, ఇద్దరు పిల్లలను పిస్తోలుతో కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటేశ్వర్లు ప్రస్తుతం కడప రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు

Andhra Pradesh Shocker: కడపలో దారుణం, భార్యతో సహా ఇద్దరు పిల్లలను తుఫాకీతో కాల్చి ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, వ్యక్తిగత కారణాలే కారణమని తెలిపిన కడప డీఎస్పీ షరీఫ్‌
Constable commits suicide (Photo-Video Grab)

కడపలో కో-ఆపరేటివ్‌ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు (50) అనే హెడ్‌ కానిస్టేబుల్‌ తన భార్య, ఇద్దరు పిల్లలను పిస్తోలుతో కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటేశ్వర్లు ప్రస్తుతం కడప రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 11 గంటలకు పీఎస్‌ నుంచి పిస్తోలు తెచ్చుకున్నాడు. అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కానిస్టేబుల్‌ ఇలా చేయడానికి గల కారణాలపై ఆరా తీశారు. వ్యక్తిగత కారణాలతోనే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నట్లు కడప డీఎస్పీ షరీఫ్‌ చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Constable commits suicide

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 05, 2023 10:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).