Munugode Bypoll 2022: మునుగోడు ఉప ఎన్నికల్లో మరో ట్విస్ట్, రిటర్నింగ్ ఆఫీసర్‌గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్‌ నియామకం, జగన్నాథరావును బదిలీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్‌గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్‌ నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. రోహిత్‌ సింగ్‌ను ఆర్‌వోగా నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్‌వో జగన్నాథ రావు స్థానంలో రోహిత్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించారు.

Munugode Bypoll 2022: మునుగోడు ఉప ఎన్నికల్లో మరో ట్విస్ట్, రిటర్నింగ్ ఆఫీసర్‌గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్‌ నియామకం, జగన్నాథరావును బదిలీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
EC releases final list of voters in Andhra Pradesh | Photo -PTI

మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్‌గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్‌ నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. రోహిత్‌ సింగ్‌ను ఆర్‌వోగా నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్‌వో జగన్నాథ రావు స్థానంలో రోహిత్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించారు. స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించే అంశంలో జగన్నాథ రావుపై వేటు పడిన సంగతి తెలిసిందే.

ఎన్నికల గుర్తుల వ్యవహారంలో వివాదం నెలకొన్న తరుణంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్‌కు గుర్తు కేటాయింపు విషయంలో జగన్నాథరావు ఇష్టారీతిగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసీ వేగంగా చర్యలు తీసుకుంది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 20, 2022 04:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).