Houthi Rebels Attack 2 More Ships: ఎర్ర సముద్రంలో మళ్లీ రెచ్చిపోయిన హౌతీ రెబల్స్, భారత్కు వస్తున్న నౌకపై డ్రోన్ల దాడి, బ్రిటన్ కంపెనీకి చెందిన నౌకపై కూడా దాడి
ఎర్ర సముద్రం మధ్యప్రాచ్య జలాల్లో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై మంగళవారం తెల్లవారుజామున అనుమానిత యెమెన్ హౌతీ తిరుగుబాటు డ్రోన్లు దాడి చేశాయని అధికారులు తెలిపారు.
Ship heading towards India attacked by suspected Yemen's Houthi Rebels: ఎర్ర సముద్రం మధ్యప్రాచ్య జలాల్లో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై మంగళవారం తెల్లవారుజామున అనుమానిత యెమెన్ హౌతీ తిరుగుబాటు డ్రోన్లు దాడి చేశాయని అధికారులు తెలిపారు. గాజా స్ట్రిప్లోని హమాస్పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంపై ఓడలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ మద్దతుగల యోధుల ప్రచారంలో తాజా దాడులు జరిగినట్లు సమాచారం. అందులో ఒకటి భారత్కు వస్తున్న నౌక కూడా ఉంది.
ఎర్ర సముద్రం దక్షిణ ప్రాంతంలో తొలి దాడి జరగగా, రెండో దాడి యెమెన్ దక్షిణ తీర ప్రాంత పట్టణం ఎడెన్ వద్ద జరిగింది.
హొడైడా వద్ద బార్బడోస్ జెండాతో వస్తున్న బ్రిటన్ కంపెనీకి చెందిన నౌకపై డ్రోన్లతో తొలి దాడి చేశారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. అయితే నౌక అద్దాలు ధ్వంసమయ్యాయని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. రెండో దాడిలో మార్షల్ జెండాతో అమెరికా నుంచి భారత్కు వస్తున్న గ్రీన్ కంపెనీకి చెందిన నౌకపై జరిగింది.ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ప్రైవేటు భద్రతా సంస్థ యాంబ్రే ( Ambrey) వెల్లడించింది. నౌకకూ నష్టం జరగలేదని తెలిపింది.
Here's News
Two ships traveling in Middle East waters were attacked by suspected Yemen Houthi rebel drones early on Tuesday, authorities said. https://t.co/UQ0S6YuY8d
— Chicago Tribune (@chicagotribune) February 6, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 07, 2024 08:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

