IPL 2023: రూ. 8 కోట్లు పెట్టి ముంబై కొనడం ఎందుకు, మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం ఎందుకు, జోఫ్రా ఆర్చర్పై మండిపడిన సునీల్ గవాస్కర్, ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దని హితవు
ఇంగ్లండ్ పేసర్, ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్మండిపడ్డాడు. కోట్లు కుమ్మరించి కొనుక్కుంటే ముంబై ఇండియన్స్కు అతడి వల్ల ఏమి ఒరిగిందని ప్రశ్నించాడు.అతడికి రూ. 8 కోట్ల మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.
ఇంగ్లండ్ పేసర్, ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్మండిపడ్డాడు. కోట్లు కుమ్మరించి కొనుక్కుంటే ముంబై ఇండియన్స్కు అతడి వల్ల ఏమి ఒరిగిందని ప్రశ్నించాడు.అతడికి రూ. 8 కోట్ల మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్-2022 వేలంలో భాగంగా 8 కోట్లు పెట్టి ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్ను కొనుగోలు చేసింది. ఫిట్నెస్ సమస్యలతో బాధ పడుతున్న ఆర్చర్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడని తెలిసినా అతడి కోసం భారీ మొత్తం వెచ్చించింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా టీ20 లీగ్ ద్వారా ఈ ఏడాది ఆరంభంలో టీ20 క్రికెట్లో తిరిగి అడుగుపెట్టిన ఆర్చర్.. ఎంఐ కేప్టౌన్ జట్టుకు ఆడాడు.
ఈ క్రమంలో ఐపీఎల్-2023 సీజన్తో క్యాష్ రిచ్ లీగ్లోకి తిరిగి వచ్చాడు. ఎన్నో అంచనాలతో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన అతడు 5 మ్యాచ్లు ఆడి కేవలం రెండు వికెట్లు తీశాడు. తర్వాత గాయం తిరగబెట్టడంతో మే 9న స్వదేశం ఇంగ్లండ్కు వెళ్లిపోయాడు.ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ జోఫ్రా ఆర్చర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
(The above story first appeared on LatestLY on May 19, 2023 03:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

