AP CM Review on Covid: టీచర్లకు త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయండి, అధికారులకు ఏపీ సీఎం ఆదేశాలు, కరోనావైరస్ నివారణ చర్యలపై క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనావైరస్ నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష (AP CM Review on Covid) నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై (CoronaVirus Prevention) సమీక్షించారు.
Amaravati, July 28: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనావైరస్ నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష (AP CM Review on Covid) నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై (CoronaVirus Prevention) సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘కాన్సన్ట్రేటర్లు, డీటైప్సిలెండర్లు, ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై శ్రద్ధవహించాలి. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
పీహెచ్సీల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉంచాలి. జిల్లాల వారీగా వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి. ఏపీఎంఎస్ఐడీసీలో ప్రత్యేక సెల్ను ఏర్పాటుచేయాలి’’ అని అధికారులను ఆదేశించారు. వచ్చే నెల నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతున్నాయని కాబట్టి వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్ను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుపై సమీక్షలో.. ‘‘100 బెడ్లు ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలి. తర్వాత మిగిలిన ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టిపెట్టాలి. ప్లాంట్ల ఏర్పాటుకు 30 శాతం సబ్సిడీ ఇస్తున్నాం. కొత్త మెడికల్ కాలేజీల కోసం పెండింగ్లో ఉన్న భూసేకరణ పూర్తిచేయాలి. వ్యాక్సినేషన్లో టీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్ను పూర్తిచేయాలి’’ అని అధికారులను ఆదేశించారు.
మే, జూన్, జులై నెలల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు 43.38 లక్షల డోసులు ఇస్తే.. కేవలం 5,24,347 డోసులు మాత్రమే వాడారని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వానికి ఇస్తే వ్యాక్సినేషన్ను వేగంగా ముందుకు సాగుతుందని, దీనిపై మరోసారి కేంద్రానికి లేఖ రాస్తానని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
(The above story first appeared on LatestLY on Jul 28, 2021 02:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

