AP Cabinet Meet Highlights: భారీగా సంక్షేమ పథకాలు, పలు కేటాయింపులు, పలు రద్దులు, సంచలన నిర్ణయాలు తీసుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. మంత్రివర్గ సమావేశంలోని ముఖ్యాంశాలు ఇవే

జగ్గయ్యపేటలో నందమూరి బాలకృష్ణ వియ్యంకుడికి గత ప్రభుత్వ హయాంలో జరిగిన 498.3 ఎకరాల భూకేటాయింపును రద్దు చేసింది. అలాగే విశాఖలో గ్రూపన్ కు కేటాయించిన 13.6 ఎకరాల భూకేటాయింపును రద్దు చేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది...

AP Cabinet Meet Highlights: భారీగా సంక్షేమ పథకాలు, పలు కేటాయింపులు, పలు రద్దులు, సంచలన నిర్ణయాలు తీసుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. మంత్రివర్గ సమావేశంలోని ముఖ్యాంశాలు ఇవే
AP Cabinet Approves Crucial Decisions. | (Photo-Twitter)

Amaravathi: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి  (YS Jaganmohan Reddy) అధ్యక్షతన సచివాలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ (Andhra Pradesh Cabinet) సమావేశం జరిగింది. గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులకు రూ .15000 సహాయం అందించే 'అమ్మ ఒడి' (Amma Odi) లాంటి ప్రతిష్టాత్మక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుంది.

రెట్టింపు పోషకాహారం అందించే పైలట్ ప్రాజెక్టుకు ఏపీ కేబినేట్ ఆమోదం తెలిపింది. గుర్తించబడిన 77 మండలాల్లో 90 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. తీవ్రమైన రక్తహీనత మరియు పోషకాహార లోపంతో బాధపడుతున్న

77 గిరిజన ప్రాంతాల్లోని 1,642 గ్రామ పంచాయతీలలోని మహిళలకు మరియు పిల్లలకు అదనపు పోషణను అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

అంతేకాకుండా, గ్రామీణ నియోజకవర్గాల్లో వ్యవసాయ ప్రయోగశాలలను ఏర్పాటు చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

ఏపీ కేబినేట్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు

  • తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, 100 గజాల లోపు ఇల్లు నిర్మించి ఉంటే రూ.1కే రిజిస్ట్రేషన్. 100 గజాల నుంచి 300 గజాల వరకు నిర్మాణం ఉంటే కలెక్టర్ నిర్ణయం మేరకు మార్కెట్ ధరకే రిజిస్ట్రేషన్
  • ఎస్సీ సబ్‌కాస్ట్‌లు, బీసీ కులాల కోసం కార్పొరేషన్లను ప్రారంభించడం.
  • ఇసుక కొరతను నివారించడంతో పాటు రోబోట్ ఇసుకను ప్రోత్సహించడానికి ఎపిఎస్‌ఎఫ్‌సి ద్వారా ప్రస్తుత క్రషర్‌లకు నాలుగు శాతం వడ్డీతో రుణం.
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ .3 లక్షలు వరకు ఉండే జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సహాయం రూ .60 వేలకు పెంపు, 3 లక్షలకు పైగా వార్షిక ఆదాయం ఉన్నవారికి ఆర్థిక సహాయం రూ. 30 వేలకు పెంపు.
  • గ్రామీణ, వార్డు స్థాయిల్లో 397 జేఎల్ఎం పోస్టుల నియామకాలకు కేబినేట్ ఆమోదం.
  • హోంశాఖలో అదనపు పోస్టుల భర్తీకి ఆమోదం.
  • నవంబర్ 7 నుంచి 'అగ్రిగోల్డ్' బాధితులకు చెల్లింపులు ప్రారంభం, రూ. 20 వేల లోపు డిపాజిట్లు కలిగిన ఖాతాదారులకు డబ్బు చెల్లించేందుకు కేబినేట్ నిర్ణయం, ఇందుకోసం రూ. 264 కోట్లు విడుదల.
  • వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు వైఎస్ఆర్ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులతో పాటు రూ. 10 లక్షల రివార్డు.
  • దీర్ఘకాలిక వ్యాదిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు ఆర్థిక సహాయం, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 5వేలు సహాయం అందించాలని నిర్ణయం.
  • పారిశుధ్య కార్మికుల వేతనం రెట్టింపు. నెలకు రూ. 8 వేల నుంచి రూ. 16 వేలకు పెంపు.

వీటితో పాటు జగ్గయ్యపేటలో నందమూరి బాలకృష్ణ వియ్యంకుడికి గత ప్రభుత్వ హయాంలో జరిగిన 498.3 ఎకరాల భూకేటాయింపును రద్దు చేసింది. అలాగే విశాఖలో గ్రూపన్ కు కేటాయించిన 13.6 ఎకరాల భూకేటాయింపును రద్దు చేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది.

(The above story first appeared on LatestLY on Oct 30, 2019 06:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).