MLA Koneti Adimulam: చెల్లి చెల్లి అంటూనే మూడు సార్లు ఎమ్మెల్యే అత్యాచారం, ఏకాంత వీడియోలతో మూగబోయిన వైనం, ఎమ్మెల్యే ఇంటిదగ్గర నిశ్శబ్ద వాతావరణం!

ఆయనో ప్రజా ప్రతినిధి. సమాజంలో అందరికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. కానీ బుద్ది వక్రీకరించింది. ఫలితం సమాజంలో అందరిలో దోషిగా నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. అవును తిరుపతి జిల్లా సత్యవేడు కోనేటి ఆదిమూలం వ్యవహార తీరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

MLA Koneti Adimulam: చెల్లి చెల్లి అంటూనే మూడు సార్లు ఎమ్మెల్యే అత్యాచారం, ఏకాంత వీడియోలతో మూగబోయిన వైనం, ఎమ్మెల్యే ఇంటిదగ్గర నిశ్శబ్ద వాతావరణం!
Shocking Facts About TDP MLA Koneti Adimulam, here is the full details

Hyd, Sep 5:  ఆయనో ప్రజా ప్రతినిధి. సమాజంలో అందరికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. కానీ బుద్ది వక్రీకరించింది. ఫలితం సమాజంలో అందరిలో దోషిగా నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. అవును తిరుపతి జిల్లా సత్యవేడు కోనేటి ఆదిమూలం వ్యవహార తీరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

2019లో వైసీపీలో గెలిచిన ఆదిమూలం, గత ఎన్నికల్లో టీడీపీలో చేరి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఓ మహిళా నేతపై ఆయన వ్యవహరించిన తీరే సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. టీడీపీ మహిళా నేతను హోటల్‌కు పిలిచి అత్యాచారం, ఆపై బెదిరింపులు సీన్ కట్ చేస్తే పార్టీ నుండే సస్పెండ్. ఇది సత్యవేడు ఎమ్మెల్యే పొలిటికల్ కెరీర్.

ఎమ్మెల్యే తనతో ఏకాంతంగా ఉన్న వీడియోలను రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది బాధితురాలు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి వేధింపులను బయట పెట్టిందంటే ఏ రేంజ్‌లో ఎమ్మెల్యే సార్ టార్చర్ పెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యే వేధింపులను తాళలేక ఏకంగా సీఎం చంద్రబాబు, చినబాబు లోకేశ్‌కు సైతం తన బాధను విన్నవించారు బాధితురాలు. ఇది తెలిసి మరింత రెచ్చిపోయారు సదరు ఎమ్మెల్యే. కానీ వీడియోలు బయట పడటంతో ఇప్పుడు ఎలా కవర్ చేసుకోవాలో తెలియని పరిస్థితి. ఫలితంగా పార్టీ నుండి సస్పెండ్ కాగా ఎమ్మెల్యే కుటుంబంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చెల్లి చెల్లి అంటూనే తనపై బెదిరింపులకు పాల్పడి మూడు సార్లు ఎమ్మెల్యే అత్యాచారం చేశాడని ఆ

Here's Video:

 వీడియోలు బయటికి వచ్చిన దగ్గరి నుండి అజ్ఞాతంలో ఉన్నారు ఆదిమూలం. ఆయన ఇంటి దగ్గర సైతం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత ఫోన్ పని చేస్తున్నప్పటికీ.. లిఫ్ట్ చేయడం లేదు ఎమ్మెల్యే. నియోజకవర్గంలో పెత్తనం కోసం కొందరు కావాలనే కుట్ర చేశారని అనుచరులతో చెబుతున్న జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఎలాంటి కుట్ర చేయాలనే ఆలోచన తనకు లేదని..ఆదిమూలం నుండి తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు బహిరంగంగా చెప్పడంతో పార్టీ నుండి సస్పెండ్ చేయగా ఎమ్మెల్యేకు ప్రజా క్షేత్రంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Here's Videos:

 

(The above story first appeared on LatestLY on Sep 05, 2024 04:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).