Brutal Attack on Tribal Woman: చెంచు మహిళ ఈశ్వరమ్మ ఘటనలో విస్తుపోయే నిజాలు, నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, బాధితురాలికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపిన మంత్రి జూపల్లి

తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మొలచింతపల్లి గ్రామంలో ఓ చెంచు మహిళపై బంధువులు దారుణానికి పాల్పడ్డారు. పది రోజులుగా ఇంట్లోనే బంధించి మర్మాంగాలపై పచ్చికారం, డీజిల్ పోసి నిప్పంటించారు.

Brutal Attack on Tribal Woman: చెంచు మహిళ ఈశ్వరమ్మ ఘటనలో విస్తుపోయే నిజాలు, నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, బాధితురాలికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపిన మంత్రి జూపల్లి
Brutal Attack on Tribal Woman

Nagar Kurnool, June 24: తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మొలచింతపల్లి గ్రామంలో ఓ చెంచు మహిళపై బంధువులు దారుణానికి పాల్పడ్డారు. పది రోజులుగా ఇంట్లోనే బంధించి మర్మాంగాలపై పచ్చికారం, డీజిల్ పోసి నిప్పంటించారు. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. బాధిత చెంచు మహిళ ఈశ్వరమ్మ భర్త ఈదన్న వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటేశ్‌ కౌలుకు తీసుకున్నాడు. అదే పొలంలో భూమి యజమానులైన ఈశ్వరమ్మ, ఈదన్నతో కూలీ పని చేయిస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తలు గొడవపడటంతో ఈశ్వరమ్మ తన తల్లి గారి ఊరు చుక్కాయపల్లికి వెళ్లింది.

విషయం తెలుసుకున్న వెంకటేశ్‌ తల్లి గారి ఇంటి నుంచి ఈశ్వరమ్మను మొలచింతపల్లి గ్రామానికి తీసుకొచ్చి తన ఇంట్లో బంధించాడు. వెంకటేశ్‌ తన భార్య శివమ్మ, బాధితురాలి బంధువు లక్ష్మమ్మ భర్త లింగస్వామితో కలిసి ఆమెపై తీవ్రంగా దాడి చేశారు. పది రోజుల కిందట దాడి జరగగా శరీరంపై కాల్చిన గాయాలున్నాయి. అప్పటి నుంచి ఇంట్లోనే పెట్టి గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీతో వైద్యం అందించారు.  హైదరాబాద్ లో భయానక రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వారి మీదకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్

విషయం తెలుసుకున్న ఈదన్న గ్రామస్థులతో కలిసి ఈదమ్మను పంపించమని కోరగా వెంకటేశ్‌ బెదిరింపులకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెళ్లి బాధితురాలిని ఇంటికి తీసుకొని రాగా ఈ దారుణం బయటకు పొక్కింది. ప్రస్తుతం ఈశ్వరమ్మ నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శనివారం ఉదయం ఆసుపత్రిలో ఆమెను కలిసిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు.

అద్దెదారులు, యజమానులు, సొంత చెల్లెలు, బావమరిది చేతిలో దారుణంగా చిత్రహింసలకు గురైన చెంచు మహిళ ఈశ్వరమ్మకు తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రూ.2 లక్షల సాయం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం కుటుంబానికి ఉన్న రెండెకరాలతో పాటు కొంత వ్యవసాయ భూమిని కూడా ఇస్తుందని ప్రకటించిన ఆయన, ఈశ్వరమ్మ ముగ్గురు కుమార్తెలను సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పిస్తామని చెప్పారు.“ఈశ్వరమ్మ మరియు ఆమె భర్త ఎవరి దగ్గరా కూలీలుగా పని చేయనవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేస్తుంది. కుటుంబాన్ని స్వతంత్రంగా, సాధికారతతో తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటాం. మేము ఇప్పటికే నలుగురు నిందితులను జైలుకు పంపాము మరియు వారికి శిక్ష పడేలా చూస్తాము, ”అని శనివారం ఆమె చికిత్స పొందుతున్న నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈశ్వరమ్మను కలిసిన తర్వాత అన్నారు.

Here's Video

ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అయితే కీలక నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడిని అరెస్టు చేయాలని పౌర హక్కుల సంఘాలు శనివారం పోలీసులను డిమాండ్ చేశాయి. ఈ కేసులో రెండో నిందితుడైన బండి శివుడిని పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదని, అతడిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పౌరహక్కుల సంఘం మహబూబ్‌నగర్ విభాగం కార్యదర్శి జక్కా బాలయ్య డిమాండ్ చేశారు.

ఈశ్వరమ్మ చికిత్స పొందుతున్న నాగర్‌కర్నూల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌తో సహా బీఆర్‌ఎస్ నాయకులు ఆమెను పరామర్శించారు. ఈ కేసులో కీలక నిందితులను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించారు. శివ ప్రధాన నిందితుడని, కేసు నమోదు కాగానే శివమ్మగా పేరు మార్చుకున్నారని బాధితురాలు మాజీ మంత్రులకు బహిరంగంగా తెలియజేశారని ఆరోపించారు.

ఈ ఘటన పై మహిళా సంఘాలు సీరియస్ అయ్యాయి. బుధవారం బాధిత మహిళ ఈశ్వరమ్మను నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో పరామర్శించి మీడియాతో మాట్లాడారు. ఆమె పై అత్యాచారం లైంగిక వేధింపులకు గురి చేసి ఆమె జననాంగాల పై కారం, డీజిల్ పోసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన మహిళను ఆసరాగా చేసుకుని కేసును పక్కదో పట్టించే కుట్ర జరుగుతుందన్నారు. దాడికి పాల్పడిన వారు బండి ఈశ్వరమ్మ, వెంకటేశ్వర్లు, మహేష్, అనూష, శివుడు, కృష్ణయ్య, వెంకటమ్మ, పాండు వీరిలో కొందరి మాత్రమే అరెస్టు చేశారని, మిగతా వారిని కూడా అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధితులకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా, ఒక ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

చెంచు మహిళ ఈశ్వరమ్మ ఘటనలో కొత్త కోణం

భూమి కోసం 20 రోజుల క్రితం ఈశ్వరమ్మ మామ నాగన్న హత్య..కొల్లాపూర్ లోని చెంచు మహిళ ఈశ్వరమ్మ పై జరిగిన అమానుష దాడి ఘటనలో ఆలస్యంగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..చెంచుల భూముల పై కన్నేసిన కొంత మంది చెంచుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారి భూమిని దక్కించుకునేందుకు హత్య చేసేందుకు కూడా వెనకడలేదన్న అనుమానాలు వ్యక్తవుతున్నాయి.. చెంచు మహిళ ఈశ్వరమ్మ భూమిని కౌలు తీసుకున్న వ్యక్తులు ఆమె పై పాశవికంగా దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే..

ఈ నెల 3న ఈశ్వరమ్మ చిన్నమామ కాట్రాజు నాగన్న (56)కు చెందిన 2.5 ఎకరాల భూమిని బండి వెంకటేష్ ఎకరా రూ. 20 లక్షలు పలుకుతుండగా రూ. 4.5 లక్షల చొప్పున ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అందుకు నాగన్న ఒప్పుకోకపోవడంతో గ్రామ శివారులో హత్య చేయగా పోస్టుమార్టం చేయకుండానే అంత్యక్రియలు చేశారు.. భూతగాదా నేపధ్యంలో ఆయన్ను హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

 

(The above story first appeared on LatestLY on Jun 24, 2024 12:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).