Degree Colleges Bandh Today: తెలంగాణలో నేటి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీల నిరవధిక బంద్.. కారణం ఏంటంటే?
తెలంగాణలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు నేటి నుంచి (మంగళవారం) నిరవధికంగా బంద్ కానున్నాయి. గడిచిన రెండేండ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్య సంఘాలు తెలిపాయి.
Hyderabad, Nov 19: తెలంగాణలోని (Telangana) ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు (Degree Colleges Bandh Today) నేటి నుంచి (మంగళవారం) నిరవధికంగా బంద్ కానున్నాయి. గడిచిన రెండేండ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్య సంఘాలు తెలిపాయి. గత బీఆర్ఎస్ సర్కారుతో పాటు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఉన్నత విద్య నిర్లక్ష్యానికి గురవుతోందని వాపోయాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ జిట్టా బాలకిష్టారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.
నేటి నుంచి తెలంగాణ లో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల బంద్
పెండింగ్ ఫీజు రీయింబర్స్ మెంట్,స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్
గత నెల 5రోజుల పాటూ డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కళాశాలలు.
బకాయిలు విడుదల చేస్తామని కళాశాలలు తెరవాలని కోరిన ప్రభుత్వం
నెల రోజులు గడుస్తున్న ఇప్పటివరకు…
— Telangana Awaaz (@telanganaawaaz) November 19, 2024
బంద్ అందుకే..
దసరా సెలవుల తర్వాత అక్టోబర్ చివరికల్లా డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారని డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్య సంఘాలు గుర్తుచేశాయి. అయితే, ఆ హామీ ఇంకా అమలుకు నోచుకోకపోవడంతోనే కళాశాలలను బంద్ చేస్తున్నామని వెల్లడించాయి.
(The above story first appeared on LatestLY on Nov 19, 2024 09:00 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

