Swapnalok Complex Fire Mishap: స్వప్నలోక్ కాంప్లెక్స్ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రమాద ఘటన పై ఒక కమిటీ వేస్తున్నట్లు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత తెలిపారు. గతంలో కూడా ఈ పరిధిలో రెండు మూడు ప్రమాదాలు జరిగాయన్న ఆమె..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనపై సికింద్రాబాద్లోని మహంకాళి పోలీసులు కేసు నమోదు చేశారు. కాంప్లెక్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేర సెక్షన్ 304 పార్ట్ 2, 324, 420 ఐపీసీ, సెక్షన్ 9 (బి) పేలుడు పదార్థాల చట్టం, 1884 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Here's CMO Tweet
మరణించినవారికి ₹5 లక్షల ఎక్స్ గ్రేషియాను సీఎం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) March 17, 2023
భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమైన స్వప్నలోక్ ఎస్టాబ్లిష్మెంట్ అసోసియేషన్, కేడియా ఇన్ఫోటెక్ లిమిటెడ్, వికాస్ పేపర్ ఫ్లెక్సో ప్యాకేజింగ్ లిమిటెడ్, క్యూనెట్, విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
(The above story first appeared on LatestLY on Mar 17, 2023 02:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

