Corona in Telangana: తెలంగాణలో కొనసాగుతున్న కరోనావైరస్ ఉధృతి, ఒక్కరోజులో కొత్తగా మరో 2,296 పాజిటివ్ కేసుల నమోదు, రాష్ట్రంలో 1 లక్షా 77 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య
జిల్లాల్లో కొవిడ్ విజృంభన కొనసాగుతోంది, నిన్న నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా 155 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరీంనగర్ నుంచి 136, వరంగల్ అర్బన్ నుంచి 99 మరియు సిద్ధిపేట నుంచి 92 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి....
Hyderabad, September 23: తెలంగాణలో కరోనా ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 55,892 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2,296 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1,388 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 26,28,897మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,77,070కి చేరుకుంది.
నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 321 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 217, మేడ్చల్ నుంచి 173 కేసులు నిర్ధారణయ్యాయి.

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

మరోవైపు గత 24 గంటల్లో మరో 10 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1062 కు పెరిగింది.
అలాగే, మంగళవారం సాయంత్రం వరకు మరో 2062 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,46,135 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,873 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Sep 23, 2020 08:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

