Cyclone Mocha: గంటకు 210 కిలోమీటర్ల వేగంతో గాలులు, 8-12 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడిన అలలు, మోచా తుపాను దెబ్బకు అల్లకల్లోలంగా రెండు దేశాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మోచ తుఫాన్ (Cyclone Mocha) బంగ్లాదేశ్ (Bangladesh ), మయన్మార్ (Myanmar) దేశాలను వణికిస్తోంది. ఈ తుఫాను ఆదివారం మధ్యాహ్నం రెండు దేశాల మధ్య తీరం దాటింది. దీంతో రెండు దేశాలను వర్షాలు హడలెత్తిస్తున్నాయి.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మోచ తుఫాన్ (Cyclone Mocha) బంగ్లాదేశ్ (Bangladesh ), మయన్మార్ (Myanmar) దేశాలను వణికిస్తోంది. ఈ తుఫాను ఆదివారం మధ్యాహ్నం రెండు దేశాల మధ్య తీరం దాటింది. దీంతో రెండు దేశాలను వర్షాలు హడలెత్తిస్తున్నాయి. పశ్చిమాన, పొరుగున ఉన్న బంగ్లాదేశ్ను తుఫాను ఢీ కొట్టడంతో సోమవారం ఒక ప్రధాన మయన్మార్ ఓడరేవు నగరంలో పదివేల మంది ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి.
తుఫాను తీరం దాటిన సమయంలో గంటకు 210 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సముద్రంలో 8-12 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగసి పడ్డాయి. భారీ గాలులతో బంగ్లాదేశ్, మయన్మార్ తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తుఫాను కారణంగా మయన్మార్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఈదురు గాలులకు చెట్లు కూలి ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విత్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు దేశాల్లో కలిపి సుమారు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్కు తుఫాను ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఆ రాష్ట్రం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.
మరోవైపు భారీ వర్షాలు, ఈదురు గాలుల ప్రభావంతో తీరప్రాంతాల సమీపంలోని విమానాశ్రయాలను అధికారులు మూసివేశారు. బంగ్లాదేశ్లో ప్రజల కోసం 1,500 తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేశారు. దాదాపు రెండు దశాబ్దాల్లో బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న అత్యంత శక్తిమంతమైన తుఫాను ఇదేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతకుముందు.. 2007లో వచ్చిన తుఫాను ధాటికి బంగ్లాదేశ్లో సుమారు 3 వేల మందికిపైగా మృతి చెందారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఇక 2008లో నర్గీస్ తుఫాను మయన్మార్లోని ఇరావాడి డెల్టాను నాశనం చేసింది, కనీసం 138,000 మంది మరణించారు.
ఆదివారం చివరి నాటికి తుఫాను చాలా వరకు దాటిపోయింది, బంగ్లాదేశ్లో దాదాపు లక్ష మంది రోహింగ్యాలు నివాసముంటున్న శరణార్థి శిబిరాలను విడిచిపెట్టారు, అక్కడ ఎటువంటి మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. తుఫాను ట్రాకర్ల ప్రకారం తుఫాను యొక్క తీవ్రతను భరించిన సుమారు 150,000 మంది ప్రజలు నివసించే రాష్ట్ర రాజధాని సిట్వేతో కమ్యూనికేషన్లు సోమవారం కూడా నిలిచిపోయాయి.
వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచం వేడెక్కుతున్నందున తుఫానులు మరింత శక్తివంతంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
(The above story first appeared on LatestLY on May 15, 2023 01:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

