North Korea Ballistic Missiles: జపాన్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా, ప్రజలెవరూ ఇండ్లనుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరిక, జపాన్‌ మీదకు 20కి పైగా మిసైల్స్‌ ప్రయోగించిన నార్త్ కొరియా

1945లో మొదలైన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలవగా.. తొలిసారిగా బుధవారం ఉత్తర కొరియా రికార్డు స్థాయిలో 20కిపైగా క్షిపణులను ప్రయోగించింది. ఆ తర్వాత దక్షిణ కొరియా సైతం పలు మిస్సైళ్లను పరీక్షించడంతో పాటు యుద్ధ విమానాలతో విన్యాసాలు చేపట్టింది. ఉత్తర కొరియా రెచ్చగొడుతోందని, దీనికి త్వరలోనే సరైన సమాధానం చెబుతామని దక్షిణ కొరియా దేశ అధ్యక్షుడు స్పష్టం చేశారు.

North Korea Ballistic Missiles: జపాన్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా, ప్రజలెవరూ ఇండ్లనుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరిక, జపాన్‌ మీదకు 20కి పైగా మిసైల్స్‌ ప్రయోగించిన నార్త్ కొరియా
missile

North Korea, NOV 03: ఉత్తర కొరియా (North Korea) కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం 7.48 గంటల సమయంలో జపాన్‌ (Japan) మీదుగా క్షిపణిని (ballistic missiles) ప్రయోగించింది. దీంతో జపాన్‌ ప్రభుత్వం అప్రమత్తమై మియాగి, యమగటా, నీగాటా నివాసితులు ఇండ్లలోనే ఉండాలని సూచించింది. దాదాపు అరగంట తర్వాత క్షిపణి జపాన్ భూభాగాన్ని దాటి పసిఫిక్ మహాసముద్రం వైపు వెళ్లిందని ఆ తర్వాత ప్రభుత్వం, కోస్ట్‌గార్డ్‌ తెలిపింది. ఉత్తర కొరియా బాలిస్టిక్‌ మిస్సైల్‌ను (ballistic missiles) ప్రయోగించడం ఇది రెండోసారి. పసిఫిక్‌లోకి ప్యోంగ్యాంగ్ (Pyongyang ) రికార్డు స్థాయిలో ఆయుధాల ప్రయోగాలను కొనసాగిస్తోంది. ఉత్తర కొరియా మిస్సైల్‌ ప్రయోగంపై దక్షిణ కొరియా మండిపడింది. చర్యకు ఉత్తర కొరియా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు యున్‌ సుక్‌ యోల్‌ హెచ్చరించారు.

Brazil Election 2022: బ్రెజిల్‌ కొత్త అధ్యక్షుడిగా లులా డ సిల్వా, స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ప్రస్తుత ప్రెసిడెంట్‌ జైర్‌ బోల్సోనారో 

1945లో మొదలైన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలవగా.. తొలిసారిగా బుధవారం ఉత్తర కొరియా రికార్డు స్థాయిలో 20కిపైగా క్షిపణులను ప్రయోగించింది. ఆ తర్వాత దక్షిణ కొరియా సైతం పలు మిస్సైళ్లను పరీక్షించడంతో పాటు యుద్ధ విమానాలతో విన్యాసాలు చేపట్టింది. ఉత్తర కొరియా రెచ్చగొడుతోందని, దీనికి త్వరలోనే సరైన సమాధానం చెబుతామని దక్షిణ కొరియా దేశ అధ్యక్షుడు స్పష్టం చేశారు.

Lockdown in China: చైనా ఆపిల్ కంపెనీలో కరోనా కల్లోలం, వేల మంది క్వారంటైన్‌లోకి,తట్టుకోలేక తీగలు దూకి పారిపోతున్న కార్మికులు, వందల కిలోమీటర్లు నడుచుకుంటూ స్వస్థలాలకు.. 

అయితే, ఉత్తర కొరియా మిస్సైల్స్‌ ప్రయోగంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి ఆటోని బ్లింకెన్‌ దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి పార్క్‌ జిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. రెచ్చగొట్టే చర్య అని, దీన్ని ఖండిస్తున్నామన్నారు.

(The above story first appeared on LatestLY on Nov 03, 2022 09:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).