Hyper Aadi and Shanti Swaroop: చనిపోయే ముందు హైపర్ ఆదినే తలుచుకుంటా, జబర్దస్త్ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు, జబర్దస్త్ కు రాకముందు రోజుకు రెండు అరటి పండ్లు తిని బ్రతికా..

శాంతి స్వరూప్ తన కెరీర్ అనుభవాలను చెబుతూ రియాక్ట్ అయిన తీరు హైలైట్ అయింది. ఈ వేదికపై తన జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్.

Hyper Aadi and Shanti Swaroop: చనిపోయే ముందు హైపర్ ఆదినే తలుచుకుంటా, జబర్దస్త్ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు, జబర్దస్త్ కు రాకముందు రోజుకు రెండు అరటి పండ్లు తిని బ్రతికా..
Jabardasth comedian Hyper Aadi (Photo-Facebook)

జబర్దస్త్ ఎంతో మంది ఆర్టిసుల జీవితానలు నిలబెట్టింది. అంతేకాదు టాలివుడ్ పరిశ్రమకు పదుల సంఖ్యలో కమెడియన్స్, ఆర్టిస్టులను అందించింది. జబర్దస్త్ వేదికపై ఓ వెలుగు వెలిగి పాపులారిటీతో పాటు చాలా మంది ఆర్టిస్టులు డబ్బు కూడా సంపాదించారు. జబర్దస్త్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ కూడా ఇచ్చిన కమెడియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అయితే జబర్దస్త్ లో హైపర్ ఆది ప్రస్థానం చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. కొత్త కమెడియన్స్‌కి అవకాశం ఇస్తూ టీమ్ లీడర్‌గా సత్తా చాటుతున్నారు హైపర్ ఆది. ఏ స్పెషల్ ప్రోగ్రాం చేసినా ఆది సందడి ఉండాల్సిందే అన్నట్లుగా మారింది ట్రెండ్.

ఈ నేపథ్యంలో హైపర్ ఆది టీమ్ మెంబర్ శాంతి స్వరూప్ ఆయనపై ఓపెన్ కామెంట్స్ చేశారు. ఈటీవీలో ప్రసారమవుతున్న మరో వినోదభరిత కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. తాజాగా ఈ ప్రోగ్రాం లేటేస్ట్ ప్రోమో రిలీజ్ చేయగా అందులో శాంతి స్వరూప్ తన కెరీర్ అనుభవాలను చెబుతూ రియాక్ట్ అయిన తీరు హైలైట్ అయింది. ఈ వేదికపై తన జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్.

Nagaland Firing : నాగాలాండ్ లో ఘోరం, తీవ్రవాదులు అనుకొని కూలీలపై కాల్పులు, 14 మంది మృతి, భద్రతా దళాల వాహనాలకు నిప్పు పెట్టిన స్థానికులు..

కెరీర్‌ ఆరంభంలో డబ్బుల్లేక రెండు అరటి పండ్లు తిని పడుకున్న రోజులున్నాయని పేర్కొంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్త అయిన సమయం 2001లో భోజనానికి డబ్బుల్లేక ప్రసాదంతో కడుపునింపుకునేవాడినని, ఆ సంగతి ఇంట్లో ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. జేబులో పది రూపాయలుంటే అది పదివేలతో సమానంగా అనిపించినా రోజులవి అని గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందారు. 2007 సంవత్సరంలో నాన్న చనిపోతే అంత్యక్రియలకు కూడా తన దగ్గర డబ్బులేని పరిస్థితి అని, రెండు వేల రూపాయలు అప్పు చేసి ఆ కార్యక్రమం వెళ్లదీశానని తెలిపారు. అయితే ఇప్పుడు తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం హైపర్ ఆది అని అన్నారు శాంతి స్వరూప్. తన నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్తున్నాయంటే ఆది ఒక్కడే కారణమని, తాను చనిపోయేటప్పుడు కూడా ఆది పేరే తలచుకుంటానని చెబుతూ గుండె బరువెక్కే మాటలతో కంటతడి పెట్టుకున్నారు శాంతి స్వరూప్. హైపర్ ఆది ఇచ్చిన ఆ అవకాశాన్ని ఇంతలా గుర్తుచేసుకోవడం శాంతి మంచితనానికి నిదర్శనమంటూ ఈ వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Dec 19, 2021 01:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).