AP Inter Results 2023: విద్యార్థులకు మరో అవకాశం, నేటి నుంచి ఇంటర్ ఫలితాల రీకౌంటింగ్, మార్కులు తక్కువ వస్తే రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు
ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఆందోళన చెందుతున్న వారికి మరో అవకాశం ఉంది. ఫలితాలపై ఏవైనా సందేహాలుంటే... ఇంటర్ బోర్డుకు అభ్యంతరాలు తెలియజేయవచ్చు. ఇంటర్ విద్యార్థులు తమ సందేహాలను నేటి నుండి మే 6 వరకు బోర్డుకు తెలియజేయవచ్చు. రీకౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఆందోళన చెందుతున్న వారికి మరో అవకాశం ఉంది. ఫలితాలపై ఏవైనా సందేహాలుంటే... ఇంటర్ బోర్డుకు అభ్యంతరాలు తెలియజేయవచ్చు. ఇంటర్ విద్యార్థులు తమ సందేహాలను నేటి నుండి మే 6 వరకు బోర్డుకు తెలియజేయవచ్చు. రీకౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మే 24 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఇంటర్ బోర్డు త్వరలో విడుదల చేస్తుందని తెలిపారు. అదే విధంగా జూన్ 5 నుంచి జూన్ 9 వరకు సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. రీ వెరిఫికేషన్లో ఫలితం ఆలస్యమైనా, మొదటి ఫలితాలే వచ్చినా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాసే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే రీ వెరిఫికేషన్ , రీ కౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్నామనే ఆశతో అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ దరఖాస్తును ఎవరూ ఉపేక్షించకూడదన్నారు.
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి. ఫీజు చెల్లింపు ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభం కానుంది. మరికొద్ది రోజుల్లో పూర్తి వివరాలను ఇంటర్ బోర్డు విడుదల చేయనుంది. ఇంటర్ బోర్డు కూడా ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయిన వారికి మరో అవకాశం ఇస్తోంది.
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను బుధవారం సాయంత్రం 6.30 గంటలకు విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇంటర్మీడియట్లో 61 శాతం, సెకండియర్లో 72 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి బొత్స తెలిపారు. ప్రథమ సంవత్సరంలో బాలికలదే పైచేయి కాగా, ద్వితీయ సంవత్సరంలో అబ్బాయిలదే పైచేయి అని వెల్లడించారు.
ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 72 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ సెకండియర్లో బాలురు 68%, బాలికలు 75% ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో, 78 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో, 77 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా మూడో స్థానంలో నిలిచాయి.
ఫస్టియర్ పరీక్ష ఫలితాల్లో మొత్తం 61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ఫస్టియర్లో బాలురు 58%, బాలికలు 65% ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్, సెకండియర్ పరీక్షల్లో అబ్బాయిల కంటే బాలికలే సత్తా చాటారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో కృష్ణా జిల్లా 77 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలవగా, పశ్చిమగోదావరి జిల్లా 70 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో, గుంటూరు జిల్లా 68 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి.
ఈ ఏడాది ఏపీ ఇంటర్ పరీక్షలకు 10,03,990 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. 4.84 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టర్ పరీక్షలు రాయగా, 5.19 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాశారు. వీరిలో 9,20,552 మంది రెగ్యులర్ విద్యార్థులు, 83,749 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు.
(The above story first appeared on LatestLY on Apr 27, 2023 11:10 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

