Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాలు, వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్న చంద్రబాబు సర్కారు

ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలను ప్రజలకు అందజేస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ తెలిపారు.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాలు, వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్న చంద్రబాబు సర్కారు
Senior IAS K Vijayanand Meets CM Chandrababu (Photo-X/CMOAP)

Vjy, Jan 21: ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలను ప్రజలకు అందజేస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెలాఖరు నుంచి పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తుందని, ఈ ప్రాంత వాసులు వాట్సాప్ ద్వారా జనన, మరణ ధృవీకరణ పత్రాలను పొందవచ్చని ఆయన వెల్లడించారు.

సోమవారం సచివాలయంలోని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ కార్యాలయంలో అధికారులతో సమావేశమైన ముఖ్య కార్యదర్శి (సీఎస్‌) వాట్సాప్‌ ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో పురోగతిని సమీక్షించారు. వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా పౌరులకు ప్రభుత్వ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే ముఖ్యమంత్రి లక్ష్యమని ఈ సమావేశంలో ఆయన నొక్కి చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్టీజీఎస్ అధికారులు, సంబంధిత శాఖాధికారులను ఆయన కోరారు.

నారా లోకేశ్‌ని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్, జనసేన ఎదురుదాడితో దిద్దుబాటు చర్యలకు దిగిన టీడీపీ అధిష్ఠానం, అధికార ప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ

ఈ ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లను, సాంకేతిక సమస్యలను గుర్తించేందుకు తెనాలిని పరీక్షా వేదికగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. సిస్టమ్ సజావుగా అమలులో ఉండేలా ఈ సమస్యలను జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. పరిష్కరించాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆర్టీజీఎస్ అధికారులకు పూర్తి సహకారం అందించాలని పంచాయతీరాజ్, ఆరోగ్య, వైద్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలను కూడా ఆయన ఆదేశించారు.

వాట్సాప్ గవర్నెన్స్ కోసం అవసరమైన అన్ని సన్నాహాలు చేసినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ (RTG) ఎస్ సురేష్ కుమార్ ధృవీకరించారు. క్షేత్రస్థాయిలో వాట్సాప్ ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. జనవరి నెలాఖరు నాటికి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వాట్సాప్ ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ సాంకేతిక ప్రక్రియను అంచనా వేస్తామని ఆర్టీజీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. దీన్ని సులభతరం చేయడానికి, RTGS ఆంధ్రప్రదేశ్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (AP CRS) క్రింద ఒక పోర్టల్‌ను అభివృద్ధి చేసింది.

(The above story first appeared on LatestLY on Jan 21, 2025 02:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).