CJI NV Ramana: రాత్రిళ్లు నాకు నిద్ర పట్టడం లేదు, న్యాయమూర్తులపై భౌతిక దాడులు పెరిగాయి, మీడియానే న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ సీజేఐ రమణ

మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై సీజేఐ స్పందిస్తూ.. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం జరుగుతోందని అన్నారు. న్యాయమూర్తులు వెంటనే స్పందించకపోవచ్చు కానీ, ఇది వారి బలహీనత లేదా నిస్సహాయతగా భావించవద్దని సీజేఐ సున్నితంగా హెచ్చరించారు.

CJI NV Ramana: రాత్రిళ్లు నాకు నిద్ర పట్టడం లేదు, న్యాయమూర్తులపై భౌతిక దాడులు పెరిగాయి, మీడియానే న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ సీజేఐ రమణ
Justice NV Ramana (Photo Credits: PTI)

రాంచీ, జూలై 23: ఎల‌క్ట్రానిక్‌, సోష‌ల్ మీడియాలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలపై చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్‌లోని రాంచీలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, మీడియానే ట్రయల్ కోర్టుల‌ను న‌డిపిస్తోంద‌ని, మీడియా చర్చల్లో నిజానిజాలకు తావు లేకుండా, అడ్డగోలు వాదనల వల్ల వాస్తవాలు మరుగునపడుతున్నాయని ఆరోపించారు. కొన్ని కేసుల్లో అనుభ‌వ‌జ్ఞులైన జ‌డ్జిలు కూడా ఇవ్వ‌లేని తీర్పుల‌ను మీడియా ప్రతినిధులు ఇస్తున్నారని ఆయ‌న అన్నారు. ఇలాంటి చ‌ర్చ‌ల ద్వారా ప్ర‌జాస్వామ్యాన్ని దెబ్బ‌తీస్తున్నార‌ని జస్టిస్ ర‌మ‌ణ ఆరోపించారు. అతి దూకుడు, బాధ్య‌తారాహిత్యం వ‌ల్ల మ‌న ప్ర‌జాస్వామ్యాన్ని రెండు అడుగులు వెన‌క్కి తీసుకువెళ్తున్న‌ట్లు మీడియాపై చీఫ్ జ‌స్టిస్ సీరియ‌స్ అయ్యారు.

న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ప్రచారం

మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై సీజేఐ స్పందిస్తూ.. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం జరుగుతోందని అన్నారు. న్యాయమూర్తులు వెంటనే స్పందించకపోవచ్చు కానీ, ఇది వారి బలహీనత లేదా నిస్సహాయతగా భావించవద్దని సీజేఐ సున్నితంగా హెచ్చరించారు.

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఎవరు? ఆమె జీవిత విశేషాలు ఏంటి? ఎన్డీయే ఆమెనే ఎందుకు సెలెక్ట్ చేసింది, ముర్ము జీవితంలో అతిపెద్ద షాక్ ఏంటో తెలుసా?

కొన్నిసార్లు నాకు రాత్రిపూట కూడా నిద్ర పట్టదు: సీజేఐ

ప్రతి వారం 100 కంటే ఎక్కువ కేసులను విచారించడం అంత సులభం కాదని సీజేఐ రమణ మాట్లాడుతూ.. తీర్పు చెప్పేటప్పుడు స్వతంత్రంగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరుసటి రోజు కోసం ప్రిపరేషన్ కోర్టు ప్రారంభం కాగానే వెంటనే మొదలవుతుంది. మేము వారానికోసారి, కోర్టు సెలవుల సమయంలో నిర్ణయాలను పరిశోధించడానికి పని చేస్తాము. నిర్ణయాలను పునఃపరిశీలించుకోవడానికి కొన్నిసార్లు నిద్రలేని రాత్రులు పడుతుంది.

న్యాయమూర్తులపై భౌతిక దాడుల సంఖ్య పెరిగింది. మనకు శక్తివంతమైన ప్రజాస్వామ్యం కావాలంటే న్యాయవ్యవస్థను బలోపేతం చేసి న్యాయమూర్తులకు సాధికారత కల్పించాలని సీజేఐ అన్నారు. ఈ రోజుల్లో న్యాయమూర్తులపై భౌతిక దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని సీజేఐ ఆవేదన చెందారు.

(The above story first appeared on LatestLY on Jul 23, 2022 05:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).