Bomb Threat to Delhi School: ఢిల్లీలో ఓ స్కూలుకు మళ్లీ బాంబు బెదిరింపు కాల్, నెల రోజుల వ్యవధిలో ఇది మూడో ఘటన
దేశ రాజధాని నగరం ఢిల్లీ(Delhi)లోని ఓ ప్రైవేటు పాఠశాల(Delhi School)కు బాంబు బెదిరింపు(Bomb Threat)కాల్ కలకలం రేపింది. పుష్పవిహార్ ప్రాంతంలోని అమృత పాఠశాలకు ఉదయం 6.35 గంటల సమయంలో ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు.
దేశ రాజధాని నగరం ఢిల్లీ(Delhi)లోని ఓ ప్రైవేటు పాఠశాల(Delhi School)కు బాంబు బెదిరింపు(Bomb Threat)కాల్ కలకలం రేపింది. పుష్పవిహార్ ప్రాంతంలోని అమృత పాఠశాలకు ఉదయం 6.35 గంటల సమయంలో ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. దీనిపై అప్రమత్తమైన యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
పాఠశాలను ఖాళీ చేయించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే, ఇప్పటి వరకు ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు తెలిపారు.సుమారు నెల రోజుల వ్యవధిలో ఇది మూడో ఘటన. ఏప్రిల్లో మథురా రోడ్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సాదిఖ్ నగర్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్కు ఇలాగే మెయిల్స్ వచ్చాయి. అప్పుడు కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.
ANI Tweet
#UPDATE | The school has been thoroughly checked through BDT (Bomb Disposal Team) and nothing has been found: Chandan Chowdhary, Deputy Commissioner of Police, South Delhi
(file pic) pic.twitter.com/ExsGXA5NmM
— ANI (@ANI) May 16, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 16, 2023 01:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

