Kangana Ranaut Comments on Sonia: హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధి కోసం తీసుకున్న నిధులను సోనియాకు పంపుతున్నారు! ఎంపీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై (Sonia Gandhi) హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న రుణాలను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం (Himachal Pradesh Government) దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడ్డారు. ఈ నిధులను సోనియాగాంధీకి పంపుతున్నదంటూ ఆరోపణలు గుప్పించారు
Dehradun, SEP 22: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై (Sonia Gandhi) హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న రుణాలను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం (Himachal Pradesh Government.) దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడ్డారు. ఈ నిధులను సోనియాగాంధీకి పంపుతున్నదంటూ ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వ ఖజానా లూటీ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు నిధులను.. ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం ఖర్చు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
సుఖ్విందర్ సింగ్ సుఖు సారధ్యంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంపై కంగనా రనౌత్ నిప్పులు చెరిగారు. ‘వారు రుణాలు తీసుకుంటారు. సోనియాగాంధీకి వాటిని చెల్లిస్తారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తారు’ అని అన్నారు. ‘ఒకవేళ మీరు సీఎం ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధికి నిధులు ఇచ్చారనుకోండి. అది సోనియాగాంధీ సహాయ నిధిగా మారుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు’ అని వ్యాఖ్యానించారు.
(The above story first appeared on LatestLY on Sep 23, 2024 12:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

