Karnataka: రూ. 500 నోట్ల కట్టను గాల్లోకి విసిరిన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల వేళ వివాదంలో డీకే శివకుమార్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి అభ్యర్ధులను కూడా ప్రకటించారు. బీజేపీ అవినీతిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే ఈ సమయంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) వివాదంలో చిక్కుకున్నారు. మాండ్య జిల్లాలో పర్యటించిన ఆయన...అక్కడ కొందరు కళాకారులపై రూ. 500 నోట్లను విసిరారు

Karnataka: రూ. 500 నోట్ల కట్టను గాల్లోకి విసిరిన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల వేళ వివాదంలో డీకే శివకుమార్
DK Shivakumar throwing Rs 500 currency notes (PIC @ ANI Twitter)

Mandya, Macrh 29: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి అభ్యర్ధులను కూడా ప్రకటించారు. బీజేపీ అవినీతిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే ఈ సమయంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) వివాదంలో చిక్కుకున్నారు. మాండ్య జిల్లాలో పర్యటించిన ఆయన...అక్కడ కొందరు కళాకారులపై రూ. 500 నోట్లను విసిరారు (throwing Rs 500 currency notes). దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. బహిరంగంగానే ఇలా నోట్లు చల్లడంపై అధికార బీజేపీ విమర్శలు చేస్తోంది. ఈ వీడియోను తమ గ్రూపుల్లో పోస్టు చేస్తోంది.

మాండ్యా జిల్లాలో ప్రజాధ్వని యాత్ర (Praja Dhwani Yatra) నిర్వహిస్తున్న డీకే శివకుమార్..ప్రచార రథంతో రోడ్‌ షో చేపట్టారు. ఈ క్రమంలో బెవినహల్లిలో కొందరు స్థానిక నేతల ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఇందులో భాగంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. అందులో పాల్గొన్న కళాకారులపై డీకే శివకుమార్ రూ. 500 నోట్లను విసరడం ఇప్పుడు వివాదంగా మారింది. అయితే కాంగ్రెస్ మాత్రం దీనిపై స్పందించలేదు. కర్ణాటక అసెంబ్లీ షెడ్యూల్ విడుదలకు ముందు ఇలా రాజకీయ దుమారం రేగడంతో రాజకీయాలు మరింత హీటెక్కాయి.

(The above story first appeared on LatestLY on Mar 29, 2023 01:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).