Karnataka Shocker: శృంగారానికి ఒప్పుకోలేదని విద్యార్థినిపై ప్రిన్సిపాల్ దారుణం, సిగిరెట్లతో కాల్చుతూ, బ్లేడ్తో కోస్తూ, అక్కడ రాడ్తో..
శృంగారానికి నిరాకరించినందుకు తొమ్మిదో తరగతి విద్యార్థినిని దారుణంగా చిత్రహింసలకు గురిచేసిన హాస్టల్ ప్రిన్సిపాల్, వార్డెన్ సహా ముగ్గురు విద్యార్థులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కర్నాటక (కర్ణాటక)లోని తుమకారు జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
Bengaluru, August 17: శృంగారానికి నిరాకరించినందుకు తొమ్మిదో తరగతి విద్యార్థినిని దారుణంగా చిత్రహింసలకు గురిచేసిన హాస్టల్ ప్రిన్సిపాల్, వార్డెన్ సహా ముగ్గురు విద్యార్థులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కర్నాటక (కర్ణాటక)లోని తుమకారు జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గురువారం పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన ఐదు నెలల క్రితం జరిగింది. టీనేజ్ విద్యార్థిని చిత్రహింసల కారణంగా చాలా కాలం పాటు ఆసుపత్రిలో చేరింది. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితులు పాఠశాల ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్, తొమ్మిది, పదో తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులు. నిందితులు మైనర్ శరీరంపై కాలుతున్న సిగరెట్లను కాల్చడంతో పాటు బ్లేడ్తో పలుచోట్ల కోసి ఇనుప రాడ్తో కొట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో స్పృహ కోల్పోయి ఆ బాలిక చిత్రహింసలకు గురయింది.
దారుణం, రియల్ ఎస్టేట్ వెంచర్లో బాలికపై తెగబడిన నలుగురు కామాంధులు, తీవ్ర గాయాలతో మృతి చెందిన మైనర్
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని తొలుత బెంగళూరు ఆస్పత్రిలో చేర్పించారు. తర్వాత పరిస్థితి విషమించడంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొంది కోలుకుంది. తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో 5 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Aug 17, 2023 05:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

