Karnataka Shocker: చెరుకుతోటలో కామాంధులు, బాత్ రూంకి వెళ్లిన బాలికను చెరుకు తోటల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం, అనంతరం దారుణంగా హత్య చేసిన కిరాతకులు

ర్ణాటక రాష్ట్రంలోని కలబురిగి జిల్లాలో టాయ్ లెట్ కు బయటకు వెళ్లిన 15 ఏళ్ల బాలిక శవమై కనిపించిందని (Minor girl found dead in Kalaburagi) పోలీసులు బుధవారం తెలిపారు.బాలికపై దుండగులు సామూహిక అత్యాచారం చేసి హత్య (gang-rape, murder suspected)చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసు వర్గాలు తెలిపాయి.

Karnataka Shocker: చెరుకుతోటలో కామాంధులు, బాత్ రూంకి వెళ్లిన బాలికను చెరుకు తోటల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం, అనంతరం దారుణంగా హత్య చేసిన కిరాతకులు
Rape image (Pic Credit- PTI)

Kalaburagi, Nov 3: కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగి జిల్లాలో టాయ్ లెట్ కు బయటకు వెళ్లిన 15 ఏళ్ల బాలిక శవమై కనిపించిందని (Minor girl found dead in Kalaburagi) పోలీసులు బుధవారం తెలిపారు.బాలికపై దుండగులు సామూహిక అత్యాచారం చేసి హత్య (gang-rape, murder suspected)చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసు వర్గాలు తెలిపాయి.మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు బాలిక మరుగుదొడ్డికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. చివరకు పొలం నుంచి ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. 9వ తరగతి చదువుతున్న బాలిక తన బంధువుల ఇంట్లో ఉంటోందని పోలీసులు తెలిపారు. అలంద పోలీసులు విచారణ చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అఫ్జలపుర తాలూకాకు చెందిన బాలిక (15) 9వ తరగతి చదివుతోంది. చదువుకుంటూ ఆళంద తాలూకాలోని కోరళ్లి గ్రామంలో మేనత్త ఇంట్లో ఉంటోంది. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కాలకృత్యాల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికారు. గ్రామానికి సమీపంలో చెరుకు తోటలో బాలిక శవమై కనిపించింది.

శ్మశానంలో యువతిపై అన్నదమ్ములు గ్యాంగ్ రేప్, ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన ఛత్రినాక పోలీసులు

బాలిక శరీరంపై గాయాలున్నాయి. ఆత్యాచారం చేసిన దుండగులు వస్త్రంతో గొంతుకు బిగించి హత్య చేసినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి.బాలికను బలవంతంగా చెరుకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. దీంతో మూకుమ్మడి అత్యాచారంగా అనుమానిస్తున్నారు.

దీపావళి పండుగకు ఊరికి వెళ్లిన బాలిక మంగళవారం మేనత్త ఇంటికి తిరిగి వచ్చింది. ఇంతలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. ఘటనాస్థలాన్ని కలబురిగి ఎస్పీ ఇశా పంత్‌ పరిశీలించారు. ఆళంద పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలిక హత్యను నిరసిస్తూ ప్రజాసంఘాలు జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేసి వెంటనే హంతకులను అరెస్ట్‌ చేసి శిక్షించాలని డిమాండ్‌ చేశాయి.

(The above story first appeared on LatestLY on Nov 03, 2022 01:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).