Kerala Horror: కేరళలో దారుణం, మద్యం మత్తులో ముగ్గురు కూతుళ్ల గొంతు కోసిన తండ్రి, అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య

కేరళలోని కొట్టాయం జిల్లాలో ఓ వ్యక్తి తన ముగ్గురు కుమార్తెల గొంతు కోసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జోస్‌గా గుర్తించిన 40 ఏళ్ల వ్యక్తి తన నివాసంలో ఉరివేసుకునే ముందు ఏడు, పది, పదమూడేళ్ల వయసున్న తన ముగ్గురు కుమార్తెల గొంతు కోశాడు.

Kerala Horror: కేరళలో దారుణం, మద్యం మత్తులో ముగ్గురు కూతుళ్ల గొంతు కోసిన తండ్రి, అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య
Representational Image | (Photo Credits: IANS)

Kottayam, Sep 5: కేరళలోని కొట్టాయం జిల్లాలో ఓ వ్యక్తి తన ముగ్గురు కుమార్తెల గొంతు కోసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జోస్‌గా గుర్తించిన 40 ఏళ్ల వ్యక్తి తన నివాసంలో ఉరివేసుకునే ముందు ఏడు, పది, పదమూడేళ్ల వయసున్న తన ముగ్గురు కుమార్తెల గొంతు కోశాడు.సోమవారం తెల్లవారుజామున 12.30 గంటలకు మెడ నరికిన యువతి ఒకరు ఇంటి పక్కనే ఉంటున్న తాతయ్యలను నిద్ర లేపడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

స్థానికులు జోస్ నివాసానికి చేరుకున్నప్పుడు, అతను ఉరివేసుకున్నాడు. అతని ముగ్గురు పిల్లలను కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించారు, అక్కడ వారు చికిత్స పొందుతున్నారు, ఏడేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్య తనను, ముగ్గురు పిల్లలను విడిచిపెట్టి వెళ్లిపోవడంతో జోస్ మనస్తాపానికి గురయ్యాడు.

నెల రోజులు ఒకే గదిలో సహజీవనం, కోర్టులో అన్న లాంటి వాడంటూ షాకిచ్చిన ప్రియురాలు, తట్టుకోలేక జడ్జి ముందే చేయి కోసుకున్న ప్రియుడు

గత ఏడాదిన్నరగా ముగ్గురు కూతుళ్లతో కలిసి జీవిస్తున్నాడు. కుమార్తెలను హత్య చేసి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.కుటుంబ కలహాలే ఘటనకు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

(The above story first appeared on LatestLY on Sep 05, 2023 07:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).