Rajasthan Road Mishap: అజ్మీర్ జిల్లాలో గ్యాస్ ట్యాంకర్‌ను డీకొన్న ట్రక్కు, మంటల్లో మాడి మసైపోయిన నలుగురు వ్యక్తులు, ఇళ్లు, దుకాణాలు కూడా అగ్నికి ఆహుతి

అజ్మీర్ జిల్లాలోని జాతీయ రహదారిపై గురువారం రాత్రి గ్యాస్ ట్యాంకర్ ట్రక్కును ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఢీకొన్న తర్వాత, రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి, ఇది నలుగురి సజీవ దహనానికి దారితీసిందని పోలీసులు జోడించారు

Rajasthan Road Mishap: అజ్మీర్ జిల్లాలో గ్యాస్ ట్యాంకర్‌ను డీకొన్న ట్రక్కు, మంటల్లో మాడి మసైపోయిన నలుగురు వ్యక్తులు, ఇళ్లు, దుకాణాలు కూడా అగ్నికి ఆహుతి
Credits: Video Grab

అజ్మీర్ జిల్లాలోని జాతీయ రహదారిపై గురువారం రాత్రి గ్యాస్ ట్యాంకర్ ట్రక్కును ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఢీకొన్న తర్వాత, రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి, ఇది నలుగురి సజీవ దహనానికి దారితీసిందని పోలీసులు జోడించారు. ఢీకొన్న ధాటికి ట్యాంకర్‌లోని పెట్రోలియం ఒక్కసారిగా బయటకు ఎగజిమ్మడంతో అటుగా వెళ్తున్న మరో రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి.

సమీపంలోని కొన్ని ఇళ్లు, దుకాణాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే పనిలో పడ్డారు.సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మృదుల్ సింగ్, సదర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చెనారామ్ బేడా, సర్కిల్ ఆఫీసర్ మసూద ఈశ్వర్ సింగ్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

రైలు ప్రమాదంతో వణుకుతున్న అమెరికా, విషపూరిత వాయువులు గాలిలోకి, బాటిల్‌లోని నీటినే తాగాలని ప్రజలను హెచ్చరించిన ఓహియో గవర్నర్

అగ్నిప్రమాదం అనంతరం అజ్మీర్ కలెక్టర్ అన్ష్‌దీప్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ చునారామ్ జాట్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు

(The above story first appeared on LatestLY on Feb 17, 2023 01:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).