Protest in Nagarjuna University: సాంబార్ లో కప్ప.. భోజనం మానేసిన విద్యార్థినులు.. నాగార్జున యూనివర్సిటీలో ధర్నా.. స్పందించిన మంత్రి నారా లోకేష్ (వీడియో)
నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినులు ధర్నాకు దిగారు. శుక్రవారం మధ్యాహ్నం సాంబార్ లో కప్ప వచ్చిందని విద్యార్థినులు భోజనం మానేశారు.
Guntur, Nov 30: గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో (Nagarjuna University) విద్యార్థినులు (Students) ధర్నాకు (Protest) దిగారు. శుక్రవారం మధ్యాహ్నం సాంబార్ లో కప్ప వచ్చిందని విద్యార్థినులు భోజనం మానేశారు. ఈ విషయం బయటకు రాకుండా ఏఎన్యూ అధికారులు జాగ్రత్త పడ్డట్టు విద్యార్థినులు ఆరోపించారు. అధికారుల తీరును నిరసిస్తూ రాత్రి వసతిగృహం వద్ద విద్యార్థినులు ధర్నాకు దిగారు.
Here's Video:
గుంటూరులోని నాగార్జున వర్సిటీ హాస్టల్ విద్యార్థినుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్
విద్యార్థినుల వసతిగృహ వార్డెన్ను సస్పెండ్ చేయాలని, మెస్ కాంట్రాక్టర్గా ఉన్న వార్డెన్పై విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు
సాంబార్లో కప్ప కనిపించిందంటూ భోజనం మానేసి నిన్న… https://t.co/6sUzcJyOzQ
— BIG TV Breaking News (@bigtvtelugu) November 30, 2024
లోకేష్ స్పందన
నాగార్జున వర్సిటీ హాస్టల్ విద్యార్థినుల ఆందోళనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. విద్యార్థినుల వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని, మెస్ కాంట్రాక్టర్ గా ఉన్న వార్డెన్ పై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
(The above story first appeared on LatestLY on Nov 30, 2024 09:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

