Uttar Pradesh Shocker: భార్యను చంపి రాత్రంతా పక్కన పడుకున్న భర్త, తెల్లారి శవాన్ని పూడ్చి ఆ సమాధిపై పంటను వేసిన కసాయి, యూపీలో దారుణ ఘటన వెలుగులోకి..

యూపీలో ఘ‌జియాబాద్‌లో దారుణ ఘటన (Uttar Pradesh Shocker) చోటు చేసుకుంది. ఓ వ్య‌క్తి త‌న భార్య‌ను కిరాతకంగా హ‌త్య (Man Kills Wife) చేశాడు. ఒక రోజంతా ఇంట్లోనే శ‌వాన్ని ఉంచి మ‌రునాడు త‌న పొలంలో శ‌వాన్ని పూడ్చి పెట్టాడు.

Uttar Pradesh Shocker: భార్యను చంపి రాత్రంతా పక్కన పడుకున్న భర్త, తెల్లారి శవాన్ని పూడ్చి ఆ సమాధిపై పంటను వేసిన కసాయి, యూపీలో దారుణ ఘటన వెలుగులోకి..
Representative Image (File Image)

Lucknow, Feb 3: యూపీలో ఘ‌జియాబాద్‌లో దారుణ ఘటన (Uttar Pradesh Shocker) చోటు చేసుకుంది. ఓ వ్య‌క్తి త‌న భార్య‌ను కిరాతకంగా హ‌త్య (Man Kills Wife) చేశాడు. ఒక రోజంతా ఇంట్లోనే శ‌వాన్ని ఉంచి మ‌రునాడు త‌న పొలంలో శ‌వాన్ని పూడ్చి పెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా 30 కిలోల ఉప్పును (Covers Body With Salt) చ‌ల్లాడు. ఇత‌రుల‌కు ఎవ‌రికీ అనుమానం రాకుండా భార్య స‌మాధిపై పంట (Grows Crop On Burial Site) పండించాడు. ఈ దారుణ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అర్థరాత్రి నగ్నంగా తలుపులు కొడుతూ మహిళ హల్ చల్, రోడ్డు మీద బట్టలు లేకుండా తిరగడం చూసి జనాలు షాక్, సోషల్ మీడియాలో సీసీ టీవీ పుటేజీ వైరల్

ఘటన వివ‌రాల్లోకి వెళ్తే..ఘ‌జియాబాద్‌కు చెందిన దినేశ్ కూర‌గాయ‌ల వ్యాపారం చేస్తుండగా ఆయనకు ఒక భార్య ఉంది. ఆమె మ‌రో వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకుంటూ వచ్చాడు. ఈ క్ర‌మంలో ఇరువురి మ‌ధ్య జ‌న‌వ‌రి 25వ తేదీన తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆమెను భ‌ర్త చంపేశాడు. శ‌వాన్ని ఒక‌రోజు మొత్తం ఇంట్లోనే ఉంచి పక్కన పడుకున్నాడు. మ‌రుస‌టి రోజు ఎవరికి తెలియకుండా త‌న పొలంలోనే శ‌వాన్ని పూడ్చి పెట్టాడు.

మొబైల్ ఆశ చూపి బాలుడితో రాత్రిపూట కోరికలను తీర్చుకుంటున్న మహిళ, విషయం తెలిసి షాక్ తిన్న తల్లిదండ్రులు, వెంటనే పోలీసులకు ఫిర్యాదు, మహిళను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

వం త్వ‌ర‌గా కుళ్లిపోవాల‌నే ఉద్దేశంతో 30 కిలోల ఉప్పు చ‌ల్లాడు. ఆ త‌ర్వాత పూర్తిగా మ‌ట్టి క‌ప్పి.. ఆ స‌మాధిపై పంట పండించాడు. దీంతో ఎవ‌రికీ అనుమానం రాలేదు.కొద్ది రోజుల త‌ర్వాత త‌న భార్య క‌నిపించ‌డం లేదంటూ దినేశ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.కాగా దినేశ్‌పైనే పోలీసుల‌కు అనుమానం రావడం..ఆయ‌న‌ను లోతుగా విచారించారు. త‌న భార్య వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తుంద‌నే అనుమానంతో చంపిన‌ట్లు దినేశ్ అంగీక‌రించాడు. దినేశ్ స‌మాచారంతో పొలంలో పాతిపెట్టిన భార్య మృత‌దేహాన్ని పోలీసులు బ‌య‌ట‌కు తీశారు.నిందితుడిని కటకటాల్లోకి పంపారు.

(The above story first appeared on LatestLY on Feb 03, 2023 08:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).