Karnataka Shocker: ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన యువతిపై గ్యాంగ్ రేప్, ఒక్కసారి కలుద్దామని పిలిచి బీర్ లో డ్రగ్ కలిపి ఇచ్చిన యువకుడు, అటవీ ప్రాంతంలో సామూహిక అత్యాచారం
సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి ఒక మహిళను కిడ్నాప్ చేశాడు. డ్రగ్స్ (Drugs) ఇచ్చి కారులో అత్యాచారానికి పాల్పడ్డాడు. (woman kidnapped and Raped) ఆ మహిళను ఆమె ఇంటి వద్ద దింపేందుకు ప్రయత్నించగా కొందరు వ్యక్తులు గమనించారు.
Bangalore, AUG 24: కారును అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళకు ఇన్స్టాగ్రామ్లో వ్యక్తి పరిచయమయ్యాడు. శుక్రవారం కర్కాలకు కారులో వచ్చిన అతడు ఆమెను కిడ్నాప్ చేశాడు. అటవీ ప్రాంతానికి ఆ మహిళను తీసుకెళ్లాడు. ఇద్దరు వ్యక్తులు అక్కడకు వచ్చారు. ఆ వ్యక్తికి బీర్ బాటిల్స్ ఇచ్చారు. కాగా, బీర్లో డ్రగ్స్ కలిపిన ఆ వ్యక్తి ఆ మహిళతో బలవంతంగా తాగించాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై కారులో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ మహిళను ఆమె ఇంటి వద్ద కారులో దింపేందుకు ప్రయత్నించాడు. అయితే హిందూ కార్యకర్తలు ఆ కారును అడ్డుకున్నారు. కారులో ఉన్న యువతి మత్తులో ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు అక్కడకు చేరుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆ యువతిపై సామూహిక లైంగిక దాడి జరిగినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడితో పాటు అతడి వెంట ఉన్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్, అత్యాచారం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Aug 24, 2024 06:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

