Sabarimala, Dec 30: కేరళలోని (Kerala) ప్రసిద్ధ శబరిమల ఆలయం (Sabarimala Temple Opened) ఈ ఏడాది మకరజ్యోతి పండుగ సందర్భంగా సోమవారం నుంచి తెరుచుకోనున్నది. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రధాన పూజారి తంత్రి కందర్ రాజీవరు నేతృత్వంలో నేడు సాయంత్రం 4 గంటలకు మేళశాంతి ఎస్ అరుణ్ కుమార్ ఆలయాన్ని తెరుస్తారని చెప్పారు. ఈ పండుగలో భాగంగా ప్రతి ఏడాది జనవరి 14న సంక్రాంతినాడు భక్తులు మకర జ్యోతిని దర్శించుకుంటారు.
#Sabarimala #temple to #reopen for #makaravilakku festival on Dec 30https://t.co/81GEfVFZ6A
— Economic Times (@EconomicTimes) December 29, 2024
మొన్నే మూసివేత
మండల పూజ అనంతరం డిసెంబర్ 26న అంటే గత గురువారం ఆలయాన్ని మూసివేశారు. 41 రోజులపాటు సాగిన పూజల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.