Bullet in Plane: మేఘాల్లో.. 3 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం మీదకు సర్రున దూసుకొచ్చిన బుల్లెట్.. సరాసరి ఓ ప్రయాణికుడి చెంపలోకి.... తర్వాత ఏమైంది??

మయన్మార్ లో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. గాల్లో 3 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలోకి తూటా దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు గాయపడ్డాడు.

Bullet in Plane: మేఘాల్లో.. 3 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం మీదకు సర్రున దూసుకొచ్చిన బుల్లెట్.. సరాసరి ఓ ప్రయాణికుడి చెంపలోకి.... తర్వాత ఏమైంది??
Plane Accident (Photo Credits: Twitter)

NewDelhi, October 3: మయన్మార్ లో (Myanmar) దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. గాల్లో 3 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలోకి (Plane) తూటా (Bullet) దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు గాయపడ్డాడు.  మయన్మార్ నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం నెపిడో నగరం నుంచి లోయికా సిటీకి బయల్దేరింది. ల్యాండింగ్ కు (Landing) సిద్ధమవుతుండగా, విమానం గోడలను చీల్చుకుంటూ  ఓ తూటా దూసుకొచ్చింది. విండో పక్కనే కూర్చున్న ఓ ప్రయాణికుడి చెంపకు గాయం చేసింది. దాంతో విమానంలో ఉన్నవారు హడలిపోయారు. ఆ సమయంలో విమానంలో 63 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన ప్రయాణికుడిని విమానం ల్యాండ్ అయిన తర్వాత హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.

సమస్యలను పట్టించుకోవడం లేదని మనస్తాపం.. గొంతు కోసుకున్న వీఆర్ఏ.. నెక్కొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం వద్ద ఘటన.. వేతన సవరణ, పదోన్నతులు సహా పలు డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు 69 రోజులుగా దీక్ష

తూటా ఘటనపై మయన్మార్ సైనిక ప్రభుత్వం స్పందించింది. లోయికా సిటీకి విమానాలను రద్దు చేసింది. విమానాశ్రయం వద్ద భారీగా సైనికులను రంగంలోకి దించింది. ఇది తమ ప్రత్యర్థి పక్షం కరెన్ నేషనల్ ప్రోగ్రెసివ్ పార్టీ (కేఎన్ పీపీ) పనే అని మయన్మార్ సైనిక ప్రభుత్వం ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను కేఎన్ పీపీ ఖండించింది. జరిగిన ఘటనలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేసింది.

(The above story first appeared on LatestLY on Oct 03, 2022 08:10 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).