Ganesh Nimajjanam-Khairatabad Ganesh Shobhayatra: కన్నులపండువగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. లైవ్ వీడియో కోసం క్లిక్ చెయ్యండి..!
70 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. నవరాత్రులపాటు ఘనంగా పూజలు అందుకున్న అనంతరం తన తల్లి గంగమ్మ ఒడికి చేరేందుకు ఖైరతాబాద్ గణపయ్య సిద్ధమయ్యాడు.
Hyderabad, Sep 17: 70 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర (Khairatabad Ganesh Shobhayatra) ప్రారంభమైంది. నవరాత్రులపాటు ఘనంగా పూజలు అందుకున్న అనంతరం తన తల్లి గంగమ్మ ఒడికి చేరేందుకు ఖైరతాబాద్ గణపయ్య సిద్ధమయ్యాడు. వినాయకుడికి కమిటీ సభ్యులు హారతి ఇచ్చి దీన్ని ప్రారంభించారు. భారీ జనసందోహం మధ్య ట్యాంక్ బండ్ వైపు కదులుతున్నాడు. ఈ సప్తముఖ మహాగణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. రెండున్నర కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది.
రూట్ ఇదే..
టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా మహాగణపతి ట్యాంక్బండ్ చేరుకుంటాడు. మధ్యాహ్నం ఒకటి, రెండు గంటల లోపు నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర, ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి హుండీ ఆదాయం ఎంతంటే..
(The above story first appeared on LatestLY on Sep 17, 2024 09:35 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

