Madhya Pradesh Horror: మధ్యప్రదేశ్‌ లో దారుణం.. గర్భిణిపై గ్యాంగ్‌ రేప్‌.. నిప్పంటించిన దుండగులు.. బాధితురాలి పరిస్థితి విషమం..

మధ్యప్రదేశ్‌ లోని మొరానా జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. ఓ గర్భిణి(34)పై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ఆ తర్వాత ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు.

Madhya Pradesh Horror: మధ్యప్రదేశ్‌ లో దారుణం.. గర్భిణిపై గ్యాంగ్‌ రేప్‌.. నిప్పంటించిన దుండగులు..  బాధితురాలి పరిస్థితి విషమం..
Representational image (Photo Credit- IANS)

Bhopal, Feb 18: మధ్యప్రదేశ్‌ (Madhya pradesh) లోని మొరానా జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. ఓ గర్భిణి(34)పై సామూహిక లైంగిక దాడికి (Rape) పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ఆ తర్వాత ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. 80 శాతం కాలిన గాయాలతో బాధితురాలు దవాఖానలో చికిత్స పొందుతున్నది. చావు బతుకుల మధ్య పోరాడుతున్నది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Criminal Case Against Pawan Kalyan: జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పై క్రిమినల్‌ కేసు.. గుంటూరు కోర్టులో నమోదు.. మార్చి 25న హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. ఇంతకీ ఏ కారణంతో జనసేనానిపై కేసు నమోదయ్యిందంటే??

భర్తపై కేసు తప్పించడానికి వెళ్లి..

పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలి భర్త లైంగిక దాడి నేరంపై జైలు కెళ్లి ఇటీవలే బెయిల్‌ పై బయటకు వచ్చాడు. తన భర్తపై లైంగిక దాడి కేసు పెట్టిన మహిళతో రాజీ చేయించటానికి బాధితురాలు యత్నించింది. ఇందులో భాగంగా కేసు పెట్టిన మహిళ గ్రామానికి వెళ్లింది. అక్కడ ఆమె ఇంట్లోని ముగ్గురు వ్యక్తులు బాధితురాలిపై సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టారు. మెజిస్ట్రేట్‌ సమక్షంలో ఆమె వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Numaish Last Day Today: హైదరాబాద్ నుమాయిష్‌ నేడే ఆఖరు.. శనివారం నాటికి దాదాపు ఇరవై లక్షలు దాటిన సందర్శకుల సంఖ్య

(The above story first appeared on LatestLY on Feb 18, 2024 10:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).