Fine For Littering, Spitting: రైల్వే ఆవరణలో చెత్త, ఉమ్మివేయడంపై భారీ జరిమానా... రెండేళ్లలో జరిమానా ద్వారా రూ.5.13 కోట్ల ఆదాయం
రైల్వే ప్రాంగణంలో ఉమ్మివేయడం, చెత్తవేయడం నిషేధించడమైనదని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. చెత్తను వేసే వ్యక్తులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది.
Newdelhi, July 27: రైల్వే ప్రాంగణంలో (Railway Stations) ఉమ్మివేయడం, చెత్తవేయడం నిషేధించడమైనదని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. చెత్తను వేసే వ్యక్తులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలలో చెత్తవేసినందుకు, ఉమ్మివేసినందుకు గాను దాదాపు 3,30,132 మందికి జరిమానా విధించినట్లు, ఈ జరిమానా ద్వారా 5.13 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించింది. గత రెండేళ్లలో గుట్కా మరకల నివారణకు, రైల్వేలను శుభ్రపరచడానికి చేసిన ఖర్చు, ఉల్లంఘించిన వారిపై వేసిన ఫైన్ లకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్ ఎంపీ నీరజ్ సభలో వేసిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది.
జరిమానా పెంచే యోచన లేదు
ఉమ్మివేయడం, చెత్తవేయడానికి సంబంధించిన జరిమానాల మొత్తాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి లేదని ఈ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది.
(The above story first appeared on LatestLY on Jul 27, 2024 09:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

