Uttarakhand Floods: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు ప్రమాదకర స్థాయిని దాటి పొంగిపొర్లుతుండటంతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఈ క్రమంలో చమోలి జిల్లాలోని నీతి లోయలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో అక్కడి ప్రధాన వంతెన క్షణాల వ్యవధిలో కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి.
వంతెన చుట్టూ నీటి మట్టం అంతకంతకూ పెరుగుతూ రాగా.. కొద్దిసేపటికే బురదతో కూడిన భారీ ప్రవాహం ఉధృతంగా వచ్చి వంతెనను బలంగా ఢీకొట్టింది. ఆ నీటి వేగానికి వంతెన నిర్మాణం పక్కకు ఒరిగిపోతూ నది ఒడ్డు వైపునకు కూలిపోయింది. ఈ ప్రమాదంతో సదరు ప్రాంతానికి ప్రధాన పట్టణంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
అదే సమయంలో నది పక్కనే ఉన్న రహదారిపై వెళ్తున్న ఒక ట్రక్కు, ఎస్యూవీ (SUV) వాహనాలు ఈ ప్రవాహాన్ని గమనించి సమయానుకూలంగా వెనక్కి మళ్లించడంతో పెను ప్రమాదం తృటిలో తప్పిపోయింది.
Uttarakhand Bridge Swept Away in Seconds by Strong Currents
🚨 Uttarakhand Bridge Swept Away In Seconds Due To Strong Currents pic.twitter.com/fvV0KM7Piy
— Global News & Geopolitics 🌍 (@GlobalNewsGeo) August 11, 2026
పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగుల దగ్గరకు వెళ్లకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు.