అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'పుష్ప'. ఈ చిత్రం నుంచి ట్రైలర్ (Pushpa Trailer) రిలీజైంది. వాస్తవానికి ఈ సాయంత్రం 6.03 గంటలకు ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో విడుదల చేయలేకపోతున్నామని చిత్రబృందం ప్రకటించింది. అయితే కొన్ని గంటల్లోనే ట్రైలర్ ను తీసుకువచ్చి అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. "భూమిపై పెరిగే బంగారం... పేరు ఎర్రచందనం" అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. అల్లు అర్జున్ నటించే యాక్షన్ సీక్వెన్స్ లు, హీరోయిన్ రష్మిక మందన్నతో రొమాన్స్, చిత్తూరు యాస అన్నీ కలగలిపి 'పుష్ప' ఎలా ఉండబోతోందో ఈ ట్రైలర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)