రవితేజ హీరోగా హరీశ్ శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ‘షో రీల్‌’ పేరిట చిత్ర బృందం ప్రత్యేక వీడియో విడుదల చేసింది.ఒక్క డైలాగ్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాలతో తీర్చిదిద్దిన వీడియో ఆసక్తిగా సాగింది. ఇందేలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా జగపతి బాబు ప్రతినాయకుడిగా నటించారు. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే  షాక్ ,మిరపకాయ్ వంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు రాబోయే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న 'రైడ్' చిత్రానికి రీమేక్‌గా  'మిస్టర్‌ బచ్చన్‌' తెరకెక్కుతుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలోనూ ఆయన అమితాబ్‌ ఫ్యాన్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. షూటింగ్‌ కార్యక్రమం ఇప్పటికే పూర్తి కావడంతో త్వరలో ప్రచార కార్యక్రమాలను మేకర్స్‌ ప్రారంభించనున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే రవితేజ తన 75వ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాతో రచయిత భాను భోగవరపును దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీలీల మరోసారి రవితేజతో జోడీగా కనిపించనుంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)