Rajinikanth: ఓటు హక్కును వినియోగించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్, ఈ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ప్రకటించని తలైవా, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఓటు హక్కును ఉదయమే వినియోగించుకున్నారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గ పరిధిలోని స్టెల్లా మేరిస్ పోలింగ్ బూత్లో రజనీకాంత్ ఓటేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న రజనీకాంత్.. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.
ఈ ఎన్నికల్లో రజనీకాంత్ ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. ఇక ఇటీవలే కేంద్రం రజనీకాంత్కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రజనీకాంత్.. ఓటర్లను కోరారు.
Superstar @rajinikanth votes in Chennai#TamilNaduElections2021 l pic.twitter.com/uxJnRH0tBB
— Nagarjun Dwarakanath (@nagarjund) April 6, 2021
Chennai: Actor Rajinikanth casts vote at a polling booth in Stella Maris of Thousand Lights constituency#TamilNaduElections pic.twitter.com/PRPGVKE8kv
— ANI (@ANI) April 6, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 06, 2021 03:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

