Akhilesh Yadav Covid: యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు కరోనా, ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నానని ట్విట్టర్ ద్వారా వెల్లడి, హరిద్వార్ లోని మహాకుంభమేళాలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్
సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కరోనా (Akhilesh Yadav Covid) బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, ఫలితంగా సెల్ఫ్ ఐసొలేషన్లో ఉన్నానని చెప్పారు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నానని వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా తనతో టచ్ లో ఉన్నవారంతా కరోనా (COVID-19 Outbreak) టెస్టులు చేయించుకోవాలని వినయపూర్వకంగా కోరుతున్నానని అఖిలేష్ తన సందేశంలో పేర్కొన్నారు. అంతేకాదు, వాళ్లంతా కొన్ని రోజుల పాటు ఐసొలేషన్ లో ఉండాలని ఆయన అభ్యర్థించారు. కాగా, ఇటీవలే హరిద్వార్ లోని మహాకుంభమేళాలో అఖిలేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా, కుంభమేళా ప్రాంతంలోని కరోనా క్యాంపుల్లో చేసిన టెస్టుల్లో గత రెండు రోజుల్లో వెయ్యిమందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం విశేషం.
Here's Akhilesh Yadav Tweet
अभी-अभी मेरी कोरोना टेस्ट की रिपोर्ट पॉज़िटिव आई है। मैंने अपने आपको सबसे अलग कर लिया है व घर पर ही उपचार शुरू हो गया है।
पिछले कुछ दिनों में जो लोग मेरे संपर्क में आये हैं, उन सबसे विनम्र आग्रह है कि वो भी जाँच करा लें। उन सभी से कुछ दिनों तक आइसोलेशन में रहने की विनती भी है।
— Akhilesh Yadav (@yadavakhilesh) April 14, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 14, 2021 03:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

