Andhra Pradesh Horror: తూర్పు గోదావరి జిల్లాలో విషాదం, ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ వైరు తగిలి నలుగురు యువకులు మృతి, వీడియో ఇదిగో..

ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని ఉండ్రాజ‌వ‌రం మండ‌లం తాడిప‌ర్రు గ్రామంలో పాప‌న్న గౌడ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం కోసం ఫ్లెక్సీలు క‌డుతున్న స‌మ‌యంలో ఈ విషాద‌ ఘ‌ట‌న జ‌రిగింది.

Andhra Pradesh Horror: తూర్పు గోదావరి జిల్లాలో విషాదం, ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ వైరు తగిలి నలుగురు యువకులు మృతి, వీడియో ఇదిగో..
Andhra Pradesh Horror: Four youths died after being hit by an electric wire in Tadiparru in East Godavari

ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని ఉండ్రాజ‌వ‌రం మండ‌లం తాడిప‌ర్రు గ్రామంలో పాప‌న్న గౌడ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం కోసం ఫ్లెక్సీలు క‌డుతున్న స‌మ‌యంలో ఈ విషాద‌ ఘ‌ట‌న జ‌రిగింది.ఫ్లెక్సీలు క‌డుతున్న స‌మ‌యంలో పైన ఉన్న‌ హైటెన్ష‌న్ వైర్లు త‌గిలి గ్రామానికి చెందిన న‌లుగురు యువ‌కులు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. కృష్ణ‌, నాగేంద్ర‌, మ‌ణికంఠ‌, వీర్రాజు మృతిచెంద‌గా.. మ‌రొక‌రి ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

ఏలూరు జిల్లాలో దారుణం, భూతగాదాల నేపథ్యంలో మహిళపై కత్తితో దాడి చేసిన మరో వ్యక్తి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

ఇక స్థానికుల స‌మాచారంతో ఘ‌టనాస్థ‌లికి చేరుకున్న ఉండ్రాజ‌వ‌రం పోలీసులు మృత‌దేహాల‌ను పోస్టుమార్టం కోసం స్థానిక ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Four youths died after being hit by an electric wire

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 04, 2024 11:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).