COVID in India: దేశంలో కరోనా సునామి..ఒక్కరోజులోనే లక్ష దాటిన కేసులు, గత 24 గంటల్లో 1,17,100 కోవిడ్ కేసులు నమోదు, కరోనా బారిన పడి 302 మంది మృతి

భారత్‌లో గడిచిన 24 గంటలలో కొత్తగా 1,17,100 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 302 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఎక్కువగా ఉంది. గడిచిన ఒక్కరోజులో అక్కడ 36, 265 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 3,71,363 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కరోనాపై బులెటిన్‌ను విడుదల చేసింది.

COVID in India: దేశంలో కరోనా సునామి..ఒక్కరోజులోనే లక్ష దాటిన కేసులు, గత 24 గంటల్లో 1,17,100 కోవిడ్ కేసులు నమోదు, కరోనా బారిన పడి 302 మంది మృతి
Coronavirus Outbreak Representational Image| (Photo Credits: PTI)

భారత్‌లో గడిచిన 24 గంటలలో కొత్తగా 1,17,100 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 302 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఎక్కువగా ఉంది. గడిచిన ఒక్కరోజులో అక్కడ 36, 265 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 3,71,363 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కరోనాపై బులెటిన్‌ను విడుదల చేసింది.

గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 30, 836 మంది, కరోనా మొదలైనప్పటి నుంచి మొత్తంగా 3, 43, 71, 845 మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 7.74 శాతంగా ఉంది. తాజాగా నమోదైన 302 మరణాలతో మొత్తం భారత్‌లో 4, 83, 178 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటిదాకా 149 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల్ని అందించినట్లు కేంద్రం ప్రకటించింది. ఇదిలా ఉంటే 27 రాష్ట్రాల్లో 3, 007 ఒమిక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయని, అందులో 1,199 మంది పేషెం‍ట్లు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 07, 2022 10:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).