Tamilisai Soundararajan: గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు తప్పిన ప్రమాదం.. స్టేజ్ ఎక్కుతూ కిందపడిన వైనం.. భద్రతా సిబ్బంది సహకారంతో పైకి లేచిన గవర్నర్ (వీడియోతో)
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం హైదరాబాద్ జేఎన్టీయూలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Hyderabad, Dec 23: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Telangana Governor Tamilisai Soundararajan) కు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం హైదరాబాద్ జేఎన్టీయూలో (JNTU) జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వేదిక పైకి వెళ్తుండగా మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా కింద పడిపోయారు. అయితే రెండు చేతులు కిందకు పెట్టడంతో ఆమెకు పెద్దగా దెబ్బలు తగలలేదు. వెంటనే గవర్నర్ వెనుక ఉన్న భద్రతా సిబ్బంది స్పందించి, గవర్నర్ ను పైకి లేపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తట్టు తాకి కింద పడ్డ గవర్నర్ తమిళిసై -Governor Tamilisai fell on the ground pic.twitter.com/FnfkorK5rI
— News Line Telugu (@NewsLineTelugu) December 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 23, 2023 05:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

