Dog Bite: కుక్క కరిచినా ఇంట్లో చెప్పని బాలుడు.. నెల రోజుల తర్వాత రేబిస్ తో మృతి.. ఘజియాబాద్ లో విషాదం
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో విషాదం నెలకొంది. తనను కుక్క కరిచిన విషయాన్ని ఓ బాలుడు తన పేరెంట్స్ కు చెప్పలేదు. నెల రోజుల తర్వాత ఆ బాలుడు రేబిస్ వ్యాధితో చనిపోయాడు.
Newdelhi, Sep 6: ఉత్తరప్రదేశ్ లోని (Uttar Pradesh) ఘజియాబాద్ లో విషాదం నెలకొంది. తనను కుక్క కరిచిన విషయాన్ని ఓ బాలుడు (Dog Bite) తన పేరెంట్స్ కు చెప్పలేదు. నెల రోజుల తర్వాత ఆ బాలుడు రేబిస్ (Rabies) వ్యాధితో చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్ (Ghaziabad) లోని చరణ్ సింగ్ కాలనీకి చెందిన షావాజ్ (14) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. నెల రోజుల క్రితం పొరుగింట్లో ఉన్న ఓ కుక్క షావాజ్ ను కరిచింది. భయంతో ఈ విషయాన్ని అతను తన తల్లిదండ్రులకు చెప్పలేదు. ఇక సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బాలుడి అనారోగ్యానికి గురయ్యాడు. ఆహారం తినడం మానేశాడు. విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో షావాజ్ను కుటుంబ సభ్యులు ప్రశ్నించగా, తనను నెల రోజుల క్రితం ఓ కుక్క కరిచిందని తెలిపాడు. ఇక తీవ్ర అస్వస్థతకు గురైన షావాజ్ను అంబులెన్స్లో తీసుకెళ్తుండగా షావాజ్ ప్రాణాలు కోల్పోయాడు.
STORY | Ghaziabad boy dies of rabies over a month after dog bite, hid incident from parents out of fear
READ: https://t.co/Ialssrekma
VIDEO: pic.twitter.com/4VGnf1t4Y2
— Press Trust of India (@PTI_News) September 6, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 06, 2023 10:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

