Siddaramaiah to Take Oath As CM: నేడు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణం.. ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల రాక
కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం బెంగళూరులోని కంఠీరవ స్టేడియాన్ని అధికారులు అందంగా ముస్తాబు చేశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానుండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Bengaluru, May 20: కర్ణాటక (Karnataka) నూతన ముఖ్యమంత్రిగా (New CM) సిద్ధరామయ్య (Siddaramaiah) ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం బెంగళూరులోని (Bengaluru) కంఠీరవ స్టేడియాన్ని అధికారులు అందంగా ముస్తాబు చేశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానుండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సిద్ధరామయ్యతో పాటు ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్, మంత్రులుగా మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా ఢిల్లీలోని కీలక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
Shri @siddaramaiah & Shri @DKShivakumar are scheduled to take oath as the Chief Minister & Deputy Chief Minister of Karnataka, respectively, at 12:30 PM today at the Kanteerava Stadium in Bengaluru. pic.twitter.com/NlvpLQtkkk
— Srinivas BV (@srinivasiyc) May 20, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 20, 2023 10:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

