ఏపీలో గడచిన 24 గంటల్లో 30,863 కరోనా పరీక్షలు నిర్వహించగా, 183 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 30 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 27, చిత్తూరు జిల్లాలో 25, శ్రీకాకుళం జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో 163 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,72,014 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,55,389 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,194 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,431కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)