Bhumana Karunakar Reddy Met CM Jagan: సీఎం జగన్ను కలిసిన టీటీడీ నూతన ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి, వీడియో ఇదిగో
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన టీటీడీ నూతన ఛైర్మన్ గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎంకు తిరుపతి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన టీటీడీ నూతన ఛైర్మన్ గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎంకు తిరుపతి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. రేపు (గురువారం) ఉదయం తిరుమలలో టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే భూమన తనయుడు అభినయ్ రెడ్డి కూడా సీఎం జగన్ను కలిశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం వారం రోజుల్లో ముగియనుండడంతో TTD చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. టీటీడీ చైర్మన్గా తిరుపతి ఎమ్మెల్యే భూమన.. గతంలో దివంగత వైఎస్ఆర్ హయాంలో భూమన 2006 నుంచి 2008 వరకు టీటీడీ చైర్మన్గా పనిచేశారు. తాజా నియామకంతో ఆయన రెండేళ్లపాటు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి 2019లో ఆ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం టీటీడీలో చైర్మన్తో పాటు 35 మంది పాలకవర్గ సభ్యులు ఉన్నారు.

Here's Video
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన టీటీడీ నూతన ఛైర్మన్ గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి. pic.twitter.com/6uCOP3iPoR
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 9, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 09, 2023 01:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

