Earth Tremors At Pulichinthala: పులిచింతల ప్రాజెక్టు సమీపంలో భూ ప్రకంపనలు.. భయంతో వణికిపోయిన ప్రజలు

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం ఏడున్నర గంటల సమయంలో అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి తదితర గ్రామాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.

Earth Tremors At Pulichinthala: పులిచింతల ప్రాజెక్టు సమీపంలో భూ ప్రకంపనలు.. భయంతో వణికిపోయిన ప్రజలు
Earthquake Representational Image- PTI

Palnadu, Feb 19: ఆంధ్రప్రదేశ్ లోని (Andhrapradesh) పల్నాడు (Palnadu) జిల్లా పులిచింతల ప్రాజెక్టు (Pulichinthala Project) పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం ఏడున్నర గంటల సమయంలో అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి తదితర గ్రామాల్లో  కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో పులిచింతల ప్రాజెక్టు సమీప గ్రామాల ప్రజలు భయంతో వణికిపోయారు. మళ్లీ భూ ప్రకంపనలు వస్తాయేమోనన్న భయంతో ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతూ రోడ్డుపైనే కాలక్షేపం చేస్తున్నారు. అయితే అవి స్వల్ప ప్రకంపనలేనని, భయపడాల్సిన అవసరం లేదని మరికొందరు చెబుతున్నారు.

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్.. హైదరాబాద్ తరలిస్తున్న పోలీసులు.. అరెస్ట్ ఎందుకంటే? (వీడియోతో)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 19, 2023 10:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).