Janasena 10th Formation Day: నేడు జనసేన 10వ ఆవిర్భావ సభ.. మచిలీపట్నంలో 34 ఎకరాల్లో సభా వేదిక.. ఆటోనగర్ నుంచి వారాహిలో బయల్దేరనున్న పవన్
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ వేడుకలు ఈరోజు జరగనున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కార్యక్రమం జరగనుంది. 34 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సభాస్థలిని ఏర్పాటు చేశారు.
Vijayawada, March 14: జనసేన పార్టీ (Janasena) 10వ ఆవిర్భావ సభ (Formation Day) వేడుకలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. కృష్ణా జిల్లా (Krishna District) మచిలీపట్నంలో కార్యక్రమం జరగనుంది. 34 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సభాస్థలిని ఏర్పాటు చేశారు. సభా వేదికకు శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు. సభా వేదిక వద్దకు జనసేనాని పవన్ కల్యాణ్ తన ప్రచార రథం వారాహిలో చేరుకోనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడలోని ఆటోనగర్ ప్రాంతం నుంచి పవన్ వారాహిలో బయల్దేరనున్నారు.
ఛలో మచిలీపట్నం !
JanaSena 10th Formation Day, March 14th, 2023, Machilipatnam.#ChaloMachilipatnam pic.twitter.com/4fAwsp3dfg
— JanaSena Party (@JanaSenaParty) March 13, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 14, 2023 09:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

