తెలంగాణలో విశ్వరూపం చూపిస్తోంది. ఒక్కరోజులోనే వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 42,991 కరోనా శాంపిల్స్ పరీక్షించగా... 1,052 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 659 కొత్త కేసులను గుర్తించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 116, రంగారెడ్డి జిల్లాలో 109 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 240 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,033కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,84,023 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,75,132 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,858 మంది చికిత్స పొందుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)